ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై ఈడీ సంచలన ఆరోపణలు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్( Delhi CM Arvind Kejriwal ) పై ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ సంచలన ఆరోపణలు చేసింది.

ఈ మేరకు ఆయన షుగర్ లెవల్స్( Sugar Levels ) పెంచుకోవడానికి మామిడి పండ్లు తింటున్నారని ఆరోపించింది.

షుగర్ లెవల్స్ పెంచుకోవడం వలన మెడికల్ బెయిల్ పొందాలని కేజ్రీవాల్ భావిస్తున్నారని ఈడీ న్యాయస్థానానికి వెల్లడించింది.

అయితే కేజ్రీవాల్ హెల్త్ చెకప్ పై రౌస్ అవెన్యూ కోర్టు( Rouse Avenue Court ) విచారణ చేపట్టగా.

ఈడీ ఈ ఆరోపణలు చేసింది.కేజ్రీవాల్ కు ఇంటి భోజనం తినేందుకు కోర్టు అనుమతి ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగానే ఆయన మామిడిపండ్లను తింటున్నారని చెప్పింది.

కాగా వారానికి మూడు రోజుల వర్చువల్ గా డాక్టర్ తో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఢిల్లీలో చంద్రబాబు ..  బిజీ బిజీ