చికోటీ ప్రవీణ్‎కు మరోసారి ఈడీ నోటీసులు

క్యాసినో కింగ్ చికోటీ ప్రవీణ్ కు మరోసారి ఈడీ నోటీసులు అందించింది.క్యాసినో కేసు వ్యవహారంలో గతంలో చికోటీని ఈడీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే.

థాయిలాండ్ ఘటన తరువాత చికోటీకి మరోసారి అధికారులు నోటీసులు అందజేశారు.కాగా చికోటీతో పాటు చిట్టి దేవేందర్, సంపత్, మాధవరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది.

ఇందులో సంపత్ ఈడీ విచారణకు హాజరు కాగా.చికోటీ ప్రవీణ్ వచ్చే వారం అధికారుల ముందు హాజరు కానున్నారు.