నేటితో ముగిసిన సమీర్ మహేంద్రు ఈడీ విచారణ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన సమీర్ మహేంద్రు ఈడీ విచారణ నేటితో ముగిసింది.

కాగా సమీర్ మహేంద్రు జ్యుడిషియల్ కస్టడీ ఈనెల 20 వరకు పొడిగించారు.అయితే గతంలో సమీర్ మహేంద్రుకు సర్జరీ జరిగిందని ఆయన తరపు న్యాయవాది తెలిపారు.

ఈ నేపథ్యంలో ఆయనకు కస్టడీలో మెడిసిన్ తో పాటు వసతులు కల్పించాలని కోరారు.

ఈ స్కాం కేసులో సమీర్ తో పాటు విజయ్ నాయర్ అరెస్ట్ కాగా.

తాజాగా హైదరాబాద్ కు చెందిన అభిషేక్ రావును అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఆటిట్యూడ్ ప్రాబ్లెమ్ తో తెరమరుగు అయినా టాలీవుడ్ సెలెబ్స్ వీరే !