ఎగ్జిట్ పోల్స్ పై ఈసీ నిషేధం

నల్లగొండ జిల్లా:ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న రాష్ట్రాల్లో ఎగ్జిట్‌ పోల్స్‌పై( Exit Polls ) నిషేధం విధిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా నోటిఫి కేషన్‌ జారీ చేసింది.

నవంబర్‌ 7వ తేదీ ఉదయం 7 గంటల నుంచి నవంబర్‌ 30 సాయంత్రం 6.

30 గంటల వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని తెలిపింది.ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహించడం, ప్రచారం చేయడం, ఫలితాలు ప్రచురించడం వంటివి చేయరాదని ఎన్నికల సంఘం పేర్కొంది.

ఎవరైనా నిబంధనల్ని ఉల్లంఘిస్తే చట్టప్రకారం రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుందని ఎన్నికల సంఘం స్పష్టంచేసింది.