విడ్డూరం: ఇడ్లీని వెరైటీగా తిన్న ఘనుడు.. చూస్తే నోరెళ్లబెట్టడం ఖాయం
TeluguStop.com
భారతదేశంలో ఒక్కోక్కరు ఒక్కో విధంగా భోజనం చేస్తుంటారు.ఉత్తర భారతంలో ఆహారపు అలవాట్లు వేరే, దక్షిణ భారత ఆహారపు అలవాట్లు వేరు.
అయితే ఎవరైనా ఇడ్లీని చట్నీలోనో లేక సాంబార్లోనో నంజుకు తింటారు.కానీ ఇక్కడో వ్యక్తి ఇడ్లీని తిన్న పద్ధతి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
‘‘నేను భారతదేశానికి కొత్త.ఇడ్లీని సరైన పద్ధతిలోనే తింటున్నానని అనుకుంటున్నాను’’ అంటూ ఓ వ్యక్తి ఇడ్లీని టీలో నంజుకుని తిన్నాడు.
దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.ఇది చూసిన నెటిజన్లు అవాక్కవ్వడమే కాకుండా వారికి తోచిన కామెంట్లు చేస్తున్నారు.
ఇడ్లీని చట్నీ, సాంబార్లో కాకుండా టీలో నంజుకుని తినొచ్చని తమకు ఇప్పటివరకు తెలియదంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.
మరికొందరు ఇడ్లీని అలా టీలో ముంచుకుని తినేకన్నా ఇడ్లీపై టీ పోసుకుని తాగేస్తే పొతుంది కదా అని కొందరు కామెంట్ చేస్తున్నారు.
ఏదేమైనా ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని ఇలాంటి వీడియోలు వైరల్ కావడంతో ఇడ్లీ ప్రియులు మాత్రం ఇలాంటి వీడియోలు చూడకండి అంటూ మరికొందరు వార్నింగ్ ఇస్తున్నారు.
నేను చచ్చిపోతా… నా బిడ్డలను కాపాడండి…పవన్ మాజీ భార్య సంచలన వ్యాఖ్యలు!