పవన్ గెలవాలని కోరుతూ మోకాళ్లపై తిరుమల మెట్లు ఎక్కిన యువతి.. ఏమైందంటే?

టాలీవుడ్ పవర్ స్టార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గురించి మనందరికీ తెలిసిందే.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో యాక్టివ్ గా ఉన్న విషయం తెలిసిందే.

అయితే ఇటీవల జరిగిన ఎన్నికలలో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే.

ఇక ఈనెల 4వ తేదీన ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.దీంతో ఆ ఎన్నికల ఫలితాల కోసం ఏపీ ప్రజలు రాజకీయ నాయకులు మొత్తం ఎంతో ఆతృతగా టెన్షన్ గా ఎదురుచూస్తున్నారు.

"""/" / ఎవరికి వారు గెలుస్తాము అన్న ధీమాతో అందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా చేసుకుంటున్నారు.

ఇది ఇలా ఉంటే కొందరు పార్టీ నాయకులు ఆ పార్టీ గెలుస్తుంది ఈ పార్టీ గెలుస్తుంది అంటూ బెట్టింగులు వేస్తుండగా మరికొందరు పార్టీ గెలవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.

అందులో భాగంగానే ఒక లేడీ అభిమాని పవన్ కళ్యాణ్ గెలవాలి అని ఈకంగా తిరుపతి మెట్లు ఎక్కింది.

అయితే తిరుపతి మెట్లు ఎక్కడం పెద్ద కష్టమేమీ కాదని అనుకుంటున్నారా కానీ ఆమె ఎక్కింది.

మామూలు కాళ్ళతో కాదండోయ్ మోకాళ్ళతో తిరుపతి( Tirupati ) మెట్లు ఎక్కి తన అభిమానాన్ని చాటుకుంది.

"""/" / ఇంతకీ ఆ మహిళ ఎవరు ఏంటి అన్న వివరాల్లోకి వెళితే.

ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయం కోరుతూ తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక యువతి మోకాళ్లపై తిరుపతి మెట్లు ఎక్కారు.

ఉండ్రజవరానికి చెందిన పసుపులేటి దుర్గా రామలక్ష్మి స్థానికంగా ఆర్ఎంపీ వైద్యం చేస్తుంటారు.పవన్ కళ్యాణ్ అంటే ఆమెకు చాలా అభిమానం.

ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ గెలవాలని తిరుమల వెంకటేశ్వరస్వామికి మొక్కుకున్నారు.అందులో భాగంగానే మే 25న సుమారు 450 మెట్లు మోకాళ్లపై ఎక్కినట్లు శుక్రవారం ఆమె తెలిపారు.

పార్టీలతో తనకు సంబంధం లేదని, కేవలం పవన్ పై ఉన్న అమితమైన అభిమానంతోనే తిరుపతి మెట్లు ఎక్కినట్లు ఆమె వెల్లడించారు.

పిఠాపురం( Pithapuram ) నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ అత్యధిక మెజార్టీతో కచ్చితంగా విజయం సాధిస్తారని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు.

తన తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, భవానీల అనుమతితోనే తిరుమల వెళ్లి మొక్కు తీర్చుకున్నట్లు ఆమె వివరించారు.

అయితే ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాటు ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన అధినేతలు ఆమెకు మద్దతుగా కామెంట్లు చేస్తూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు27, మంగళవారం 2024