ద్వారకా క్రియేషన్స్ ‘అఖండ’ ఫస్ట్ సింగిల్ `అడిగా అడిగా..` విడుదల

న‌ట‌సింహా నందమూరి బాలకృష్ణ, మాస్‌ డైరెక్టర్ బోయపాటి శ్రీ‌ను కాంబినేషన్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ చిత్రం`అఖండ` మీద భారీ స్థాయిలో క్రేజ్ నెలకొంది.

ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.

ఈ మూవీ మ్యూజిక‌ల్ ప్ర‌మోష‌న్స్‌ను మొద‌లుపెట్టింది చిత్ర యూనిట్‌.దానిలో భాగంగా ఈ రోజు అఖండ ఫ‌స్ట్ సింగిల్ `అడిగా అడిగా` ను రిలీజ్ చేశారు.

ఈ పాట బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ కు ఒకరిపట్ల ఇంకొకరి ఎంత ప్రేమ ఉందో చూపించేలా సాగింది.

ప్ర‌స్తుతం మంచి ఫామ్‌లో ఉన్న త‌మ‌న్ ఈ మెలోడి గీతం కోసం ఒక అద్భుత‌మైన ట్యూన్ ను అందించారు.

ఎస్పీ చరణ్, ఎంఎల్ శ్రుతి ఈ పాటను శ్రావ్యంగా పాడారు.కళ్యాణ్ చక్రవర్తి మంచి సాహిత్యాన్ని అందించారు.

ఈ పాట సంగీత ప్రియుల్ని అల‌రిస్తుంది.ఇక బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ జోడి స్క్రీన్ మీద మ్యాజిక్ చేయబోతోన్నట్టు కనిపిస్తోంది.

కొరియోగ్రఫీ అద్భుతంగా ఉంది.నిర్మాణ విలువలు భారీగా ఉన్నాయి.

బోయపాటి శ్రీను సినిమాలంటే కచ్చితంగా మంచి మెలోడీ పాట ఉండాల్సిందే.ఆ కోవలో త‌ప్ప‌కుండా `అడిగా అడిగా` పాట‌ చేరుతుంది.

"""/"/ ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవిందర్ రెడ్డి అఖండ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

జగపతిబాబు, శ్రీకాంత్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.తమన్ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.

సి.రాం ప్రసాద్ కెమెరామెన్‌గా, కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

వీడియో: ఇన్‌స్టా రీల్స్‌ విషయంలో గొడవ.. రోడ్డు మీద కొట్టుకున్న యువతులు..