‘ఉస్తాద్’ నుండి క్రేజీ న్యూస్ చెప్పిన దేవిశ్రీ.. పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రెజెంట్ వరుస సినిమాలను లైన్లో పెట్టుకుంటున్నాడు.ఇటు రాజకీయాల్లో పాల్గొంటూనే సినిమాలను కూడా మ్యానేజ్ చేస్తున్నాడు.

పవన్ లైనప్ చూసి ఫ్యాన్స్ తెగ సంతోష పడుతున్నారు.ఎందుకంటే కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన లైనప్ ను ప్రకటించాడు.

ఎప్పుడు ఒక్క సినిమాను పూర్తి చేయగానే మరో సినిమాను ప్రకటించే పవన్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత మాత్రం వరుస సినిమాలను ప్రకటించాడు.

ప్రెజెంట్ పవన్ కళ్యాణ్ చేస్తున్న హరిహర వీరమల్లు చివరి దశకు చేరుకుంది.ఈ సినిమా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.

పవన్ కళ్యాణ్ మొదటిసారి పీరియాడికల్ డ్రామా చేస్తున్నాడు.అది కూడా పాన్ ఇండియా సినిమా కావడం విశేషం.

ఇక ఈ సినిమా తర్వాత పవర్ స్టార్ లైనప్ లో ముందుగా ఉంది హరీష్ శంకర్ అనే చెప్పాలి.

ఇప్పటికే వీరి కాంబోలో గబ్బర్ సింగ్ అనే సూపర్ హిట్ సినిమా తెరకెక్కింది.

"""/" / ఇప్పుడు ఇదే కాంబోలో ఇప్పుడు మరో సినిమా రాబోతుంది అని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను ప్రకటించిన విషయం విదితమే.

ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో హరీష్ శంకర్ బిజీగా ఉన్నారు.

ఈ సినిమా స్టార్ట్ కాకుండానే భారీ అంచనాలను క్రియేట్ చేసుకున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

"""/" / పవన్ సినిమాల్లో జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది వంటి హిట్స్ అందించిన దేవిశ్రీ ఇప్పుడు ఉస్తాద్ కు కూడా అంతకు మించి ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నాడు.

తాజాగా దేవిశ్రీ లైవ్ కాన్సర్ట్ లో మాట్లాడుతూ.ఈ సినిమాకు సంబందించిన పాటను కంపోజ్ చేయడం పూర్తయ్యిందని.

అది వేరే లెవల్ లో ఉంటుందని చెప్పడంతో ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా 2024లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్11, శుక్రవారం 2024