తిరుమల శ్రీవారి ఆలయంపై డ్రోన్ కెమెరా విజువల్స్ వివాదం

తిరుమల శ్రీవారి ఆలయంపై డ్రోన్ కలకలం ఘటనపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు.

శ్రీవారి ఆలయంపై డ్రోన్ తో వీడియోలు తీసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో డ్రోన్ వీడియోల వివాదంపై టీటీడీ విజిలెన్స్ దర్యాప్తు చేస్తుందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

సామాజిక మాధ్యమాల్లో వచ్చిన దృశ్యాలు డ్రోన్ ద్వారా వీడియో తీసారా లేదా త్రీడీ మార్ఫింగ్ చేశారా అన్న దానిపై విచారణ చేస్తున్నామని వెల్లడించారు.

శ్రీవారి ఆలయంపైన విమానాలు, డ్రోన్ లు తిరగడానికి ఆగమ శాస్త్రాలు అంగీకరించవని స్పష్టం చేశారు.

హైపర్ ఆది వల్లే జబర్దస్త్ మానేశాను… రీతూ చౌదరి కామెంట్స్ వైరల్!