వేములవాడ రాజన్నను దర్శించుకున్న బిఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ గోలి మోహన్

రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ అకాల వర్షానికి పంట నష్టం జరిగి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ దుఃఖంతో ఉండడంతో నియోజకవర్గంలో పర్యటిస్తున్న డాక్టర్ గోలి మోహన్ ప్రజల స్థితిగతులు, సమస్యలు తెలుసుకుని వారికి సహకారం అందిస్తూ బుధవారం వేములవాడ రాజన్నకు కోడమొక్కులు చెల్లించారు.

ఈ సందర్భంగా గోలి మోహన్ మాట్లాడుతూ వేములవాడ నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉండాలని,సకాలంలో వర్షాలు పడి పంటలు పండాలని రైతులు, మహిళలు, యువకులు సుఖసంతోషాలతో ఉండాలని ప్రజలందరినీ రాజరాజేశ్వర స్వామి కృపాకటాక్షంతో చల్లగా చూడాలని రాబోయే రోజుల్లో ఈ వేములవాడ నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలకు సహకారం అందించడానికి తగిన శక్తిని ప్రసాదించాలని స్వామి వారిని వేడుకున్నారు.

ప్రభాస్ ఓకే అంటే రూ.200 కోట్లు ఇవ్వడానికి సిద్ధమే.. ప్రభాస్ క్రేజ్ కా బాప్ అంటూ?