రక్తదానం చేయండి – ప్రాణ దాతలు అవండి..

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వాసుపత్రిలో శాంతినగర్ కు చెందిన మానస అనే మహిళకు డెలివరీ సమయంలో అత్యవసరంగా ఏ పాజిటివ్ రక్తం అవసరం ఉన్నదని తెలియగానే సిరిసిల్ల రెడ్ డ్రాప్ మెంబర్ టిఎన్ఎస్ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు మోతే రాజిరెడ్డి రక్తదానం ( 26 వ సారి ) చేయడం జరిగింది.

ఈ సందర్భంగా మోతె రాజిరెడ్డి మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేసి వారి ప్రాణాలను కాపాడటానికి యువత ముందుకు రావాలని ఆరోగ్యంగా ఉన్న ప్రతి వ్యక్తి 3 నెలలకొకసారి రక్తాన్ని ఇవ్వొచ్చన్నారు.

తలసేమియా చిన్నారులకు వేసవిలో రక్త నిల్వలు లేక ఎంతో మంది చిన్నారులు చనిపోతున్నారు.

యువతలో మార్పు వచ్చి రక్తదానం చేయడానికి ముందుకు రావాలని ఆయన కోరారు.

అన్ స్టాపబుల్ షోలో మరోమారు సందడి చేయనున్న ఏపీ సీఎం.. ఫోటోలు వైరల్!