అమ్మ పాడే జోల పాట గాయని ఎవరో తెలుసా..?

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ యూట్యూబ్ ఓపెన్ చేసిన ఒకటే పాట ఎక్కువగా వినబడుతుంది.

ఇక సోషల్ మీడియాలో ఈ పాటకు రీల్స్ తెగ వైరల్ అవుతున్నాయి.అమ్మకు సంబంధించిన ఈ పాట ప్రస్తుతం ఎందరినో ఆకట్టుకుంటుంది.

అమ్మపై ఉన్న చెప్పలేని ప్రేమను ఎంతో అందంగా పాట రూపంలో వినిపించిన ఆ వాయిస్ ఎందరో హృదయాలను ఇట్టే ఆకర్షిస్తుంది.

మనసుని హత్తుకునే లిరిక్స్ అందుకు తగ్గ వినసంపైన వాయిస్ జత కావడంతో ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో ట్రేడింగ్ గా మారింది.

ఈ సాంగ్ ఒక్కసారి విన్నవారు పదేపదే ఆ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ పాటను మిట్టపల్లి సురేందర్ ( Mittapalli Surender )రాశారు.అయితే ఆయన పాట అద్భుతంగా రాసిన.

దానిని ఎంతో అందంగా ఆలపించిన ఆ అమ్మాయి వీడియోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

ఇకపోతే ఆ అమ్మాయి ఎవరు ఆ అమ్మాయి బ్యాగ్రౌండ్ ఏంటన్న విషయాలు ఓసారి చూస్తే.

"""/" / అమ్మ పాట పాడిన ఆ అమ్మాయి పేరు జాహ్నవి ఎర్రం( Jahnavi Erram ).

ఈ అమ్మాయి మహారాష్ట్రకు( Maharashtra ) చెందిన తెలుగు మూలాలు ఉన్న అమ్మాయి.

ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాహ్నవి తాను తెలుగు అమ్మాయిని కానీ.తనకి తెలుగు మాట్లాడడం సరిగా రాదని చెప్పుకొచ్చింది.

జాహ్నవి మిట్టపల్లి స్టూడియో ఛానల్ కోసం ఈ పాటను ఆలపించింది.ఈ పాటను మిట్టపల్లి సురేందర్ రాయగా సిస్కో డిస్కో ( Cisco Disco )అనే బృందం సంగీతం అందించారు.

వినడానికి ఎంతో ఇంపుసొంపుగా ఉన్న ఈ పాట ఎంతోమంది హృదయాలను దోచేసింది. """/" / ఇందులో ముఖ్యంగా మాట్లాడటానికి తెలుగు రాకపోయినా అమ్మ పాటను ఎంతో వినుసంపుగా, అందంగా పాడిన సింగర్ జాహ్నవి నీ పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు ప్రజలు.

ఈ మధ్యకాలంలో జాహ్నవి మెట్టుపల్లి సురేంద్ర కలిసి అనేక ఇంటర్వ్యూలలో పాల్గొన్న సంగతి కూడా తెలిసిందే.

ఈ పాట పాడిన తర్వాత జాహ్నవికి ఇంస్టాగ్రామ్ లో ఏకంగా 1.26 మిలియన్ ఫాలోవర్స్ వచ్చేశారు.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ పాటను మరో మారి వినండి.

నాగ్ అశ్విన్ ఫ్యామిలీ ఆ ఊరిలో సాయిబాబా ఆలయాన్ని నిర్మించిందా. గ్రేట్ అంటూ?