రోజులో ఏ సమయంలో పూజ చేస్తే..వెయ్యి రెట్లు పుణ్యం లభిస్తుందో తెలుసా..?
TeluguStop.com
మన దేశంలో చాలా మంది ప్రజలు తమ ఇంట్లో కానీ, దేవాలయాలకు వెళ్లి కానీ పూజలు, అభిషేకాలు చేస్తూ ఉంటారు.
కొంత మంది ప్రజలు ఎప్పుడు పడితే అప్పుడు పూజలు చేస్తూ ఉంటారు.కానీ పూజలు చేయడానికి కూడా ఒక నిర్దిష్టమైన సమయం ఉంటుందని పండితులు చెబుతున్నారు.
సాధారణంగా చెప్పాలంటే పూజ ను ఏ సమయంలోనైనా చేసుకోవచ్చు.సర్వకాల సర్వ వస్త్రాలలో భగవంతుడి అర్చన చేసుకోవచ్చు.
కానీ ఉదయం సమయంలో చేసే పూజ వల్ల దేవత అనుగ్రహం లభించి మనసుకు ప్రశాంతత లభిస్తుంది.
"""/" /
అలాగే సూర్యుడు( Lord Sun ) అస్తమించే సమయంలో కొన్ని పనులు అస్సలు చేయకూడదు.
ఆ కాలంలో అన్నం అస్సలు తినకూడదు.నిద్రపోకూడదు.
ప్రయాణాలు చేయకూడదు.కానీ ఈ సంధ్యా సమయంలో పూజ చేస్తే గొప్ప ఫలితాన్ని పొందవచ్చు.
అందులోనూ శివ పూజ( Lord Shiva ) చేస్తే అఖండ పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది.
అందులో ఎటువంటి సందేహం లేదని పండితులు చెబుతున్నారు.పూజలు( Puja ) ఎప్పుడు కూడా ఉదయం, మధ్యాహ్నం, అలాగే సాయంత్రం ఈ మూడు కాలాలలో కూడా పూజ చేసినట్లయితే, ఆ పూజ సహస్రగుణం అంటే 1000 రెట్లు ఎక్కువగా పుణ్య ప్రాప్తిని, పూజాఫలాన్ని పొందవచ్చు అని పండితులు చెబుతున్నారు.
"""/" /
ఎందుకంటే ఈ సమయంలోనే దేవతలు ఏ భక్తుడు వారిని ఆరాధిస్తారా అని ఎదురుచూస్తూ ఉంటారని పండితులు చెబుతున్నారు.
కాబట్టి ఈ సమయంలో ఇష్ట దైవాన్ని పూజిస్తే వారి యొక్క అనుగ్రహాన్ని త్వరగా పొందవచ్చు అని చెబుతున్నారు.
అలాగే పూజ చేసే సమయంలో ఇష్ట దైవాన్ని ప్రత్యేకంగా అలంకరించడం వల్ల, ఆ అలంకరణ అలాగే వారికి పెట్టే నైవేద్యాలు సరాసరి వారికే అందుతాయని పండితులు చెబుతున్నారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్26, శనివారం 2025