సంకెళ్ళతో బంధీగా ఉండి కాపలా కాస్తున్న ఆంజనేయస్వామి ఎక్కడున్నాడో తెలుసా
TeluguStop.com
మన సనాతన భారత దేశంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు, పురాతన పట్టణాలు ఉన్నాయి.
ఈ విధంగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయాలలో ఒరిస్సాకు చెందిన పూరి జగన్నాథ ఆలయం ఒకటి అని చెప్పవచ్చు.
ఈ పూరి జగన్నాథ ఆలయంలో ఆంజనేయస్వామిఆలయం కూడా ఉంది.ఈ ఆలయంలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దారియ మహా వీర దేవాలయం అని కూడా పిలుస్తారు.
అయితే ఇప్పటి వరకు ఏ ఆలయంలో చూడని విధంగా ఆంజనేయ స్వామిని ఇక్కడ దర్శించుకోవచ్చు.
ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి సంకెళ్ళతో బంధించబడి ఉంటాడు.ఈ విధంగా స్వామి వారిని సంకెళ్లతో బంధించడానికి గల కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
పురాణాల కథల ప్రకారం జగన్నాథ ఆలయం ఈ ప్రాంతంలో వెలసిన తర్వాత స్వామివారిని దర్శించుకోవడానికి సముద్ర దేవుడు ఆలయాన్ని సందర్శించాడు.
అయితే సముద్ర దేవుడు ఇక్కడికి రావడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా నీటితో మునిగిపోయి హానికర వాతావరణం ఏర్పడింది.
అయితే ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు సముద్ర దేవుడి నుంచి తమను రక్షించాల్సినదిగా ఆ జగన్నాథుని వేడుకున్నారు.
భక్తుల ప్రార్థనలతో అనుగ్రహించిన జగన్నాథుడు ఆ ప్రాంతానికి రక్షకుడిగా ఆంజనేయ స్వామినీ ఉండాల్సిందిగా వివరించాడు.
"""/" /
ఆంజనేయస్వామి రామభక్తుడు అనే విషయం మనకు తెలిసిందే.అయితే ఈ జగన్నాధుని అనుమతి లేకుండా ఆంజనేయుడు అయోధ్య వెళ్ళినట్లు తెలియడంతో ఎంతో ఆగ్రహించిన జగన్నాథుడు ఈ ప్రాంతాన్ని రాత్రీ,పగలు కాపాడాల్సిన బాధ్యతలను హనుమంతుడు మర్చిపోయాడని భావించి ఆంజనేయుడి కాళ్లు, చేతులను సంకెళ్లతో బంధించి ఇకపై ఈ స్థలంలో సదా వెలిసి ఉండు.
ఈ స్థలంలోకి ఎటువంటి సముద్రపు నీరు రాకుండా, ఇక్కడి ప్రజలను రక్షించాల్సినదిగా జగన్నాథుడు ఆంజనేయుడికి తెలియజేశాడు.
అప్పటి నుంచే ఈ ఆలయంలో కొలువై ఉన్న ఆంజనేయుడిని దారీయ మహావీర అని కూడా పిలుస్తారు.
అంటే సముద్రం నుంచి ఆ మహా నగరాన్ని సంరక్షిస్తున్న అని అర్థం.అదేవిధంగా సంకెళ్ళతో బంధింపబడి ఉన్నాడు కాబట్టి బేడీ హనుమంతుడు అని కూడా పిలుస్తారు.
సముద్ర గర్భం తీరం దగ్గరే ఉన్న ఎంత పెద్ద తుఫాన్ వచ్చినప్పటికీ ఈ స్థలంలోకి సముద్రపు నీరు చేరదని అక్కడి ప్రజలు తెలియజేస్తారు.