మహాలయ పక్షంలో సూర్యగ్రహణం ఏర్పడితే మంచిదో కాదో తెలుసా..?

ముఖ్యంగా చెప్పాలంటే అక్టోబర్ 14వ తేదీన భాద్రపద మాస కృష్ణపక్ష అమావాస్య ఈ మహాలయ పక్షంలో ఆఖరి రోజు అని పండితులు( Scholars ) చెబుతున్నారు.

అంతే కాకుండా మహాలయ అమావాస్య రోజున పండితులు చెప్పిన దాని ప్రకారం భాద్రపద మాస అమావాస్య చిత్తా నక్షత్రంలో సూర్యగ్రహణం వస్తుంది.

భారత కాలమానం ప్రకారం 8 గంటల 34 నిమిషములకు సంపూర్ణ సూర్యగ్రహణం మొదలవుతుందని చెబుతున్నారు.

ఇది అర్ధరాత్రి రెండు గంటల 28 నిమిషములకు ముగిస్తుందని పండితులు చెబుతున్నారు.ఈ సూర్యగ్రహణం ( Solar Eclipse )భారత దేశంలో సంభవించదని అందు వల్ల భారత దేశంలో గ్రహణం నియమాలు పాటించాల్సిన అవసరం లేదని పండితులు చెబుతున్నారు.

"""/" / అలాగే మహాలయ పక్షాలలో గ్రహణం రావడం దోషమేమీ కాదు అని, ప్రతి ఏడాదిలో సూర్య, చంద్ర గ్రహణాలు సంభవిస్తాయని పండితులు చెబుతున్నారు.

గ్రహణ సమయంలో చేసేటటువంటి ఇతరులు తర్పనాలకు కూడా విశిష్టమైన ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు.

అంతే కాకుండా మహాలయ పక్షాలలో ఈ సూర్య గ్రహణం భారతదేశంలో కనిపించకపోవడం కారణంగా దీనికి సంబంధించినటువంటి గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదని కూడా పండితులు చెబుతున్నారు.

ఈ సూర్య గ్రహణం సంభవించేటటువంటి ఉత్తర, దక్షిణ అమెరికా, కొలంబియా, పసిఫిక్ మహా సముద్రం ఉన్నటు వంటి ప్రాంతాల వారు గ్రహణ నియమాలు కచ్చితంగా ఆచరించాలని పండితులు చెబుతున్నారు.

"""/" / అలాగే మన భారత దేశంలోని వారందరూ సూర్య గ్రహణం సంభవించని కారణాంతో మహాలయ పక్షాలు పితృ పక్షాలకు సంబంధించిన మహాలయ అమావాస్యకు సంబంధించిన కార్యక్రమాలను మాత్రమే యధావిధిగా కొనసాగించాలని చెబుతున్నారు.

అంతే కాకుండా మహాలయ అమావాస్య రోజు భారతదేశంలో ఎలాంటి గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదని కూడా పండితులు చెబుతున్నారు.

అయినా కూడా కాస్త జాగ్రత్తగా ఉండడమే మంచిది.

వీడియో వైరల్.. ఫన్నీ టమాటా రైమ్‭తో అదరగొట్టిన టీచర్లు!