శనివారం రోజు శ్రీవారికి నివేదించే ప్రసాదం గురించి తెలుసా..
TeluguStop.com
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా ఉంది.శనివారం రోజు శ్రీనివాసుడికి ఎంతో ఇష్టమైన రోజు కావడంతో సుప్రభాతం నువ్వుల గింజలతో అర్చకులు ప్రసాదాన్ని నివేదిస్తారు.
శుక్రవారం రోజున దాదాపు 61 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారు.ఇంకా చెప్పాలంటే స్వామివారికి 27 వేల మంది తలనీలాలను సమర్పించారు.
భక్తుల హుండీ ద్వారా రూ.3 కోట్లు కానుకలుగా సమర్పించారు.
అయితే సర్వదర్శనం భక్తులతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో 18 కంపార్ట్మెంట్లలో భక్తులు నిలబడి ఉన్నారు.
దీనితో స్వామివారి సర్వదర్శనానికి దాదాపు 18 గంటల సమయం పడుతుంది. """/"/
ఇంకా చెప్పాలంటే ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు రెండు గంటల సమయం పడుతుంది.
శ్రీవారి దేవాలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు ను అర్చకులు నిర్వహిస్తారు.
శనివారం రోజు శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన రోజు అని వేద పండితులు చెబుతున్నారు.
ఈ క్రమంలో ప్రత్యూష కాల ఆరాధనతో దేవాలయ ద్వారములను తెరిచిన అర్చకులు, సన్నిధి గొల్లలు, జియ్యంగార్లు స్వామివారి సన్నిధిలోకి ప్రవేశించి స్వామివారి తొలి దర్శనం చేసుకుంటారు.
"""/"/
బంగారు వాకిలి వద్ద శ్రీ వెంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామివారిని మేలుకొలుపుతారు.
బంగారు వాకిలి వద్ద శ్రీ వెంకటేశ్వరుని సుప్రభాత స్తోత్రం ప్రవర్తి, మంగళ శాసనం వంటివి పటిస్తూ ఉండగా సన్నిధిలో వైఖానస అర్చకులు ప్రత్యూష కాలరాతనలో భాగంగా శ్రీవారికి మొదటి నివేదనగా పచ్చిపాలను నివేదిస్తారు.
ఆ తర్వాత నల్ల నువ్వుల బెల్లంతో కలిపిన ప్రసాదాన్ని స్వామి వారికి నివేదిస్తారు.
ముందు రోజు రాత్రి పవళింపు సేవలో బంగారు నవారు మంచంపై సేవించి ఉన్న శ్రీవారు కౌతుక బేరం శ్రీ భోగ శ్రీనివాసరావు మూర్తి వారిని మూలవిరాట్ పాదాల వద్ద ఉంచి సింహాసనంపై జీవ స్థానంలో పవళింప చేస్తారు.
ఆ తర్వాత ఏకాంతంగా శ్రీవారికి కర్పూర నిరాజనం సమర్పణ జరుపుతారు.దీనినే కైకర్యపరుల హారతి అని అంటారు.
టిక్టాక్ ఉన్న ఐఫోన్ కోసం రూ.43 కోట్లా.. అమెరికన్ జనాల్లో టిక్టాక్ పిచ్చి పీక్స్కి!