ఢిల్లీలో అవార్డులు ఇచ్చి గల్లీలో తిడతారా?: మంత్రి హరీశ్ రావు

ప్రధానమంత్రి మోదీ వరంగల్ సభలో చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు స్పందించారు.

ఢిల్లీలో అవార్డులు ఇచ్చి గల్లీలో తిడతారా అని ప్రశ్నించారు.తమ పథకాలను ఎందుకు కాపీ చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన మిషన్ భగీరథ, రైతుబంధును కాపీ కొట్టారని విమర్శించారు.తెలంగాణ అభివృద్ధిని కేంద్రం అడ్డుకుంటోందన్నారు.

కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని వ్యాగన్ ఇస్తారా అని ప్రశ్నించారు.ఈడీ, సీబీఐని అడ్డం పెట్టుకుని కక్ష సాధిస్తున్నారని తెలిపారు.

గిరిజన వర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏమైందని ప్రశ్నించారు.బీజేపీ మోసాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.

కేసీఆర్ గొప్పతనంతోనే తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు.కేసీఆర్ కిసాన్ అజెండాతో మోదీకి భయం పట్టుకుందన్నారు.

అందుకే తెలంగాణపై మోదీ బురద జల్లుతున్నారని విమర్శించారు.

బాబాయ్ హత్యపై అన్నను నిలదీస్తున్న షర్మిల