దివాళీ వ‌చ్చేస్తోందీ..దీపాల మ‌ధ్య మీరూ మెర‌వాలంటే ఇలా చేయండి!

ఏదైనా పండ‌గ వ‌స్తోందంటే చాలు మ‌గువ‌లు అందంగా, ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించాల‌ని తెగ ఆర‌ట ప‌డి పోతుంటారు.

ఈ క్ర‌మంలోనే బ్యూటీ పార్ల‌ర్‌కు వెళ్లి వేలకు వేలు ఖ‌ర్చు పెడుతుంటారు.ఇక త్వ‌ర‌లోనే దిపావ‌ళి పండ‌గా వ‌స్తోంది.

అయితే బ్యూటీ పార్ల‌ర్‌కి వెళ్ల‌కుండానే దీపాల కాంతాల మ‌ధ్య అందంగా మెరిసిపోవాల‌నుకుంటే ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా చేయండి.

మ‌రి లేటెందుకు అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లి పోదాం ప‌దండీ.h3 Class=subheader-styleస్టెప్-1:/h3p ముందుగా నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత ఒక స్పూన్ పెరుగులో చిటికెడు ప‌సుపు వేసుకుని ముఖానికి అప్లై చేసి రెండు నిమిషాల పాటు క్లిన్సింగ్ చేసుకోవాలి.

ఆపై గోరు వెచ్చ‌ని నీటితో ముఖాన్ని శుభ్ర‌ప‌రుచుకోవాలి. """/" / H3 Class=subheader-styleస్టెప్‌-2:/h3p ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో స్పూన్ గోధుమ పిండి, రెండు స్పూన్ల ట‌మాటా జ్యూస్‌, ఒక స్పూన్ పెరుగు మ‌రియు కొద్దిగా తేనె వేసుకుని బాగా క‌లుపుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి, మెడ‌కు అప్లై చేసి స్మూత్‌గా స్క్ర‌బ్ చేసుకోవాలి.

మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు స్క్ర‌బ్ చేసుకున్న అనంత‌రం నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.

"""/" / H3 Class=subheader-styleస్టెప్-3:/h3p బౌల్‌లో క‌ప్పు వాట‌ర్, ఒక స్పూన్ గ్రీన్ టీ పౌడ‌ర్‌, ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి మ‌రిగించి చ‌ల్ల బెట్టు కోవాలి.

ఆపై వాట‌ర్‌ను ఫిల్ట‌ర్ చేసుకుని ప‌క్క‌న పెట్టు కోవాలి.ఇప్పుడు బౌల్ తీసుకుని ఒక స్పూన్ ముల్తానీ మ‌ట్టి, ఒక స్పూన్ చంద‌నం పొడి మ‌రియు ముందుగా త‌యారు చేసుకున్న వాట‌ర్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మంతో ముఖానికి ప్యాక్ వేసుకుని ఇర‌వై నిమిషాల పాటు డ్రై అవ్వ‌నివ్వాలి.

అనంత‌రం కూల్ వాట‌ర్‌తో ముఖాన్ని క్లీన్ చేసుకుని.మాయిశ్చ‌రైజ‌ర్ రాసుకోవాలి.

వారంలో రెండు సార్లు ఈ మూడు స్టెప్స్‌ను పాటిస్తే మృత క‌ణాలు, మ‌చ్చ‌లు, మొటిమ‌లు పోతాయి.

చ‌ర్మ కాంతి పెరుగుతుంది.స్కిన్ టోన్ సైతం మెరుగు ప‌డుతుంది.

ఎవరితో చేసుకుంటారో చేసుకోండి.. జెర్సీ సీక్వెల్ పై నాని షాకింగ్ కామెంట్స్!