భీమ్ దీక్ష ముగింపు సభను విజయవంతం చేయండి – స్వేరోస్ నెట్వర్క్ జిల్లా కో ఆర్డినేటర్ మారుపాక రాజు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో స్వేరోస్ నెట్వర్క్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న స్వేరోస్ నెట్వర్క్ జిల్లా కో ఆర్డినేటర్ మారుపాక రాజు మాట్లాడుతూ.

మహాత్మా జ్యోతిరావు ఫూలే, బాబా సాహెబ్ అంబేద్కర్ లాంటి మహనీయుల ఆలోచనలను ఆచరణలో తీసుకవచ్చే విధానమే స్వేరో భీమ్ దీక్ష.

మార్చి15-ఏప్రిల్ 14 వరకు పవిత్ర మాసాలుగా భావిస్తూ వేల సంవత్సరాలుగా మానవ జాతిని పట్టి పీడిస్తున్న దుర అలవాట్లను మరియు సాంఘిక రుగ్మతలను రూపుమాపి,దూరలవాట్లను వదిలి చదువు అనే ఆయుధంతో సంపూర్ణమైన జ్ఞానవంతమైన జీవితంతో బ్రతకండి అంటూ సమాజ హితం కోరుతూ, సమాజ శ్రేయస్సు కోసం అన్ని వర్గాల అభివృద్ధి కోసం సేవలు అందిస్తూ స్వేరో భీమ్ దీక్షతో సరికొత్త జ్ఞాన సమాజ స్థాపనలో బాగస్వాములవుతాం రండి.

! ఈనెల 23న పి.ఎస్.

ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్, పోతిరెడ్డిపల్లి క్రాస్ రోడ్డు, కార్పొరేషన్ బ్యాక్ వెనుక, సంగారెడ్డి జిల్లాలో జరగబోయే స్వేరోస్ భీమ్ దీక్ష ముగింపు సభను విజయవంతం చేయాలని పిలపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో స్వేరోస్ నాయకులు లింగాల సంధీప్, కోప్పెల్లి రాజు, గడ్డమీది సాయిచంద్, పుట్టి బన్ని, న్యాత దేవరాజు, బీపెట కృష్ణ, కోప్పెల్లి రఘు, షేక్ అన్వర్ తదితరులు పాల్గొన్నారు.

ఈఫిల్ టవర్ దగ్గర అదిరిపోయే డ్యాన్స్ చేసిన ఇండియన్.. వీడియో చూస్తే..