వివాదాస్పదంగా మారిన జిల్లా ఎస్పీ వ్యాఖ్యలు

సూర్యాపేట జిల్లా:సెప్టెంబర్17 జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

ర్యాలీ ముగింపు సభలో జిల్లా ఎస్పీ ఎస్.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ మీ అందరికీ ఆకలి అవుతుందా? అంటూ శ్రీశ్రీ మాటలు వినిపించారు.

అయితే మనం భోజనానికి వెళ్దాం కానీ, ఇప్పుడు నేను జయహో మంత్రి జగదీష్ రెడ్డి అంటే మీరంతా జయహో అని అనాలని చెప్పడంతో అంతా షాక్ కి గురయ్యారు.

ఎస్పీ వ్యవహార శైలిని చూసిన ర్యాలీకి హాజరైన ప్రజలు ఇదేంటని చెవులు కోరుకున్నారు.

విషయం తెలిసిన ప్రతిపక్ష పార్టీల నేతలు ఎస్పీ తీరుపై మండిపడుతున్నారు.తెలంగాణ రాష్ట్రంలో ఐఏఎస్ లు,ఐపీఎస్ లు అధికారులుగా కాకుండా టీఆర్ఎస్ నాయకుల్లా పని చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.

H-1B Visa Program కోసం ‘ ట్రూత్ సోషల్ ’’ దరఖాస్తు .. నానా మాటలు అన్న ట్రంప్, ఇప్పుడేమో..?