బాధిత కుటుంబానికి బియ్యం వితరణ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కిషన్ దాస్ పేట్ ( Kishan Das Pate )లో శివరాత్రి శివవ్వ(75) అనే వృద్దురాలు ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా బాధిత కుటుంబానికి ఎల్లారెడ్డిపేట సర్పంచ్, సామాజిక కార్యకర్త నేవూరి వెంకట్ రెడ్డి ( Nevuri Venkat Reddy )50 కిలోల బియ్యాన్ని వితరణ చేశారు.

ఆ కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న వెంకట్ రెడ్డి మానవత్వంతో స్పందించి బియ్యం అందజేశారు.

సర్పంచ్ వెంకట్ రెడ్డికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు ద్యాగం లక్ష్మీనారాయణ, నాయకుడు గన్న మల్లారెడ్డి పాల్గొన్నారు.

అలాంటి సినిమా తీద్దామని నాని ఎంతో ఆశపడ్డారు కానీ నవీన్ పొలిశెట్టి బ్రేక్ వేశారు..?