నిరుపేద కుటుంబానికి కి పుస్తే మట్టెల పంపిణీ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట లో నిరుపేద కుటుంబానికి చెందిన యువతి వివాహానికి ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి శుక్రవారం పుస్తె మట్టెలను వితరణ చేశారు.

నేవూరి వెంకట్ రెడ్డి వారి తల్లిదండ్రులైన కీర్తిశేషులు స్వర్గీయ నేవూరి లక్ష్మి మల్లారెడ్డి ల జ్ఞాపకార్థం ఇప్పటివరకు 996 నిరుపేద కుటుంబాలకు పుస్తె మట్టెలను పంపిణీ చేశారు.

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఎనగందుల దేవయ్య- భూమవ్వ ల కూతురు కవిత వివాహము అచ్చుమయపల్లి గ్రామానికి చెందిన భారతి కీ.

శే.సంపతి పోచయ్య ల కుమారుడు సురేష్ తో శుక్రవారం జరిగిన వివాహానికి పుస్తే మట్టెలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు బందారపు బాల్ రెడ్డి,నేవూరి నర్సింహారెడ్డి, ఎలగందుల బాబు , తదితరులు పాల్గొన్నారు.

స్కిల్ ఉంటేనే ఎంట్రీ, కఠిన నిబంధనలు… విదేశీ విద్యార్ధులపై ఆస్ట్రేలియా కొత్త పాలసీ