నిరుపేద అమ్మాయి వివాహానికి బియ్యం,వంటి సామాగ్రి వితరణ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల ( తుర్కాశిపల్లి)లో ఓ నిరుపేద కుటుంబానికి చెందిన అమ్మాయి వివాహం ఉన్నందున ఆ విషయాన్ని తెలుసుకున్న బహుజన సమాజ్ పార్టీ ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు నీరటి భాను ఆధ్వర్యంలో పార్టీ జిల్లా అధ్యక్షులు వర్దవెళ్ళి స్వామిగౌడ్ చేతుల మీదుగా 50 కిలోల బియ్యం, పెళ్లి కి సంబంధించిన వంట సామగ్రి అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా గ్రామస్తులు, కుటుంబ సభ్యులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సిరిసిల్ల నియోజకవర్గ ఉపాధ్యక్షుడు తాటి పెల్లి అంజయ్య,మండల ప్రధాన కార్యదర్శి హైదర్, అందె చంద్రయ్య, శ్రీనివాస్, మండల కమిటీ భాద్యులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబో లో వచ్చే సినిమా ఎలా ఉండబోతుంది..?