తంగళ్ళపల్లిలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ.

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లిలో కళ్యాణ లక్ష్మి చెక్కులను శనివారం ప్రజాప్రతినిధులు కలిసి 11మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టి ఆడపిల్లలకు ఆసరా నిలిచిందని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను చేపట్టి అందరికీ అండగా ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ పడిగేల మానస రాజు, సర్పంచ్ అంకారపు అనిత రవీందర్,ఎంపీటీసీ అంతయ్య, బిఆర్ఎస్ నాయకులురాజన్న జగన్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.

వీడియో: రైల్వే ట్రాక్‌పై గొడుగు వేసుకుని దర్జాగా నిద్రపోయాడు.. ట్రైన్ రావడంతో..?