రేపు అమరావతిలో ఇళ్ల పట్టాల పంపిణీ

అమరావతిలో రేపు ఏపీ ప్రభుత్వం ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనుంది.సుమారు 50 వేల మంది పేద ప్రజలకు సీఎం జగన్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తారని మంత్రి జోగి రమేశ్ తెలిపారు.

పేదలకు ఇళ్లు ఇవ్వొద్దని పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ టీడీపీ అని మంత్రి జోగి రమేశ్ విమర్శించారు.

టీడీపీ పెత్తందారులవైపు పోరాటం చేస్తోందన్నారు.పేదలకు ఇళ్లు ఇవ్వడానికి ప్రభుత్వమే పోరాటం చేయాల్సి వచ్చిందని తెలిపారు.

సీఎం జగన్ సుప్రీంకోర్టు వరకు వెళ్లి పేదలను గెలిపించారని పేర్కొన్నారు.పనికిమాలిన పెత్తందారులు, జేఏసీలను తరిమికొడతామని స్పష్టం చేశారు.

వైసీపీ ఎన్నికల ప్రచారంలో జోష్.. మంగళగిరికి సీఎం జగన్