జనగామ మున్సిపాలిటీలో అసమ్మతి రాగం..కలెక్టర్ వద్దకు కౌన్సిలర్లు

జనగామ మున్సిపాలిటీలో ముసలం రాజుకున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో బీఆర్ఎస్ అసమ్మతి కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ ను కలిశారు.

మున్సిపల్ ఛైర్ పర్సన్ పోకల జమునతో పాటు వైస్ ఛైర్మన్ మేకల రాంప్రసాద్ పై అవిశ్వాస తీర్మానం సిద్ధం చేశారు.

ఈ మేరకు అవిశ్వాస తీర్మానంపై 19 మంది కౌన్సిలర్లు సంతకాలు చేశారు.

సంతకం చేసిన వీరిలో 11 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాగా ఎనిమిది మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు ఉన్నారు.

అవిశ్వాసంపై సంతకం చేయని వారిలో ఐదుగురు బీఆర్ఎస్, నలుగురు బీజేపీ కౌన్సిలర్లు ఉన్నారు.

ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మాన కాపీని కలెక్టర్ కు అందజేశారు.

H-1B Visa Program కోసం ‘ ట్రూత్ సోషల్ ’’ దరఖాస్తు .. నానా మాటలు అన్న ట్రంప్, ఇప్పుడేమో..?