శ్రీహరి చనిపోయే ముందు ముక్కు, చెవి, కళ్లనుంచి రక్తం.. డిస్కో శాంతి ఏం చెప్పారంటే?

రియల్ స్టార్ శ్రీహరిని( Srihari ) అభిమానించే అభిమానులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారనే సంగతి తెలిసిందే.

హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా ప్రతిభ చూపిన శ్రీహరి మరణం ఆయన అభిమానులను ఎంతగానో బాధ పెట్టింది.

తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన డిస్కో శాంతి( Disco Shanti ) ఆ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు.

శ్రీహరి గారు చనిపోయే ముందు ముక్కు, చెవి, కళ్లనుంచి రక్తం వచ్చిందని ఆమె అన్నారు.

నేను మాట్లాడుతుంటే కళ్లు మూసుకొని పోయాయని డిస్కో శాంతి అన్నారు.శ్రీహరి గారికి ఒక ఇంజెక్షన్ తప్పుగా ఇచ్చారని ఆ ఇంజెక్షన్( Injection ) ఇచ్చిన తర్వాత ఈ సమస్యలు మొదలయ్యాయని డిస్కో శాంతి చెప్పుకొచ్చారు.

శ్రీహరి ఆస్తుల విషయంలో( Srihari Assets ) చాలామంది మోసం చేశారని చివరకు నా బంగారం కూడా తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆమె కామెంట్లు చేశారు.

బావ చనిపోయిన తర్వాత తాగుడుకు బానిస అయ్యానని డిస్కో శాంతి పేర్కొన్నారు. """/" / బావ గుర్తుకురాకుండా ఉండాలని మద్యం తాగుతున్నానని ఆమె అన్నారు.

భద్రాచలం,( Bhadrachalam Movie ) విజయరామరాజు( Vijayaramaraju ) సినిమాలు శ్రీహరి నటించిన సినిమాలలో ఇష్టమని డిస్కో శాంతి అన్నారు.

శ్రీహరి బ్రతికి ఉంటే ఇంట్లో ఉండే హడావిడి వేరని ఆమె చెప్పుకొచ్చారు.శ్రీహరి గారికి ఇండస్ట్రీలో ఎక్కువమంది స్నేహితులు లేరని డిస్కో శాంతి వెల్లడించారు.

నా పిల్లలు ఇటీవల జైలర్ చూశారని ఆమె తెలిపారు. """/" / నా కొడుకు స్నేహితులు ఇంటికి వస్తుంటే ఆనందంగా ఉందని డిస్కో శాంతి వెల్లడించారు.

బావ చనిపోయిన తర్వాత మూడేళ్ల పాటు తాళి తీయలేదని డిస్కో శాంతి అన్నారు.

మాది లవ్ మ్యారేజ్ అని శ్రీహరి గారు నా వెంట పడ్డారని ఆమె చెప్పుకొచ్చారు.

డిస్కో శాంతి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు పరిస్థితి ఏంటి..?