పీఏపల్లి పిఎసిఎస్ లో నెగ్గిన అవిశ్వాసం…!

నల్లగొండ జిల్లా : పీఏపల్లి పిఎసిఎస్ బీఆర్ఎస్ చైర్మన్ వల్లపు రెడ్డి, వైస్ చైర్మన్లపై గురువారం సొంతపార్టీకి చెందిన పాలకవర్గ సభ్యులు పెట్టిన అవిశ్వాసం నెగ్గింది.

సొసైటీలో మొత్తం 13 మంది డైరెక్టర్లకు గాను 11 మంది డైరెక్టర్లు హాజరై అవిశ్వాసానికి మద్దతు తెలపడంతో గతంలో ఉన్న చైర్మన్,వైస్ చైర్మన్ పదవి కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.

అదేవిధంగా నూతనంగా చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నుకున్నారు.పీఏపల్లి మండల కేంద్రానికి చెందిన తెర మణిపాల్ రెడ్డి చైర్మన్ గా,పెద్దగట్టు గ్రామానికి చెందిన సీతారాముడు వైస్ చైర్మన్ గా ఎన్నుకున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు 29, గురువారం 2024