తిరుపతిలో విద్యార్థుల అదృశ్యం కలకలం

తిరుపతి జిల్లాలో నలుగురు విద్యార్థులు అదృశ్యమైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.వీరిలో ఇద్దరు తొమ్మిదో తరగతి చదువుతుండగా ఒకరు ఎనిమిదవ తరగతి, మరొకరి ఆరవ తరగతి విద్యార్థిగా తెలుస్తోంది.

నిన్న స్కూల్ కని వెళ్లిన విద్యార్థులు ఇప్పటివరకు తిరిగి రాలేదని సమాచారం.మంగళం జెడ్పీ హైస్కూల్ లో విద్యార్థులు చదువుతున్నారు.

దీంతో బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు అలిపిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

పేరెంట్స్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు అదృశ్యమైన పిల్లల ఫొటోలను విడుదల చేశారు.

అనంతరం విద్యార్థుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Elon Musk : న్యాయపోరాటంలో ఆర్ధిక ఇబ్బందులు .. భారత సంతతి వైద్యురాలికి అండగా నిలిచిన ఎలాన్ మస్క్