అపరిశుభ్రంగా బస్టాండ్…

సూర్యాపేట జిల్లా:నిత్యం ప్రయాణికులతో రద్దీగా వుండే సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్ ( Huzur Nagar )కొత్త బస్టాండ్ పరిసరాలు అపరిశుభ్రతకు కేరాఫ్ అడ్రస్ గా మారాయని,జన సంచార ప్రదేశంలో మురుగు నీటి నిల్వలు ఉండడంతో దుర్గంధం వెదజల్లుతూ,దోమలు ఈగలు స్వైర విహారం చేస్తున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు.

అసలే ప్రమాదకర విషజ్వరాలు ప్రబలుతున్న పరిస్థితుల్లో బస్టాండ్ ( Bus Stand )ప్రాంతంలో పారిశుద్ద్య లోపం ప్రయాణికుల ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

/BR ఇప్పటికైనాఆర్టీసి అధికారులు( RTC Officials ) స్పందించి బస్టాండ్ ఆవరణలో నెలకొన్న అపరిశుభ్రతను రూపుమాపి ప్రయాణికులకు మెరుగైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

జీరా వాట‌ర్ బ‌రువు త‌గ్గ‌డానికి మాత్రమే కాదు.. ఆ స‌మ‌స్య‌ల‌కు కూడా చెక్ పెడుతుంది తెలుసా?