డైరెక్టర్ తేజతో గొడవ పడిన ఆ హీరో ఎవరో తెలుసా…?

డైరెక్టర్ తేజ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు.తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి కొత్తవాళ్ళని ఎక్కువ సంఖ్యలో పరిచయం చేసిన డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది తేజ అనే చెప్పాలి.

చిత్రం సినిమా తో డైరెక్టర్ గా పరిచయం అయిన తేజ మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకున్నాడు.

ఈ సినిమా తో తను దర్శకుడి గా పరిచయం అయింది కాకుండా హీరో, హీరోయిన్, కామెడీయన్స్ తోపాటు ఇంకా చాలా మంది టెక్నిషియన్స్ ని కూడా కొత్త వారిని తీసుకువచ్చాడు ఈ సినిమాతో ఉదయ్ కిరణ్ హీరో గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

అలాగే ఈ సినిమా తరువాత చేసిన జయం మూవీ తో నితిన్ సదా లాంటి వాళ్లని తెలుగు తెరకి పరిచయం చేసాడు.

ఈ సినిమా కూడా మంచి విజయం అందుకోవడంతో తేజ పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోయింది.

అలా తేజ ఆ తర్వాత మహేష్ బాబు తో నిజం సినిమా చేసాడు.

అయితే తేజ నితిన్ ని హీరోగా ఇండస్ట్రీ కి పరిచయం చేసిన వ్యక్తి కాబట్టి రెండోసారి వీళ్లిద్దరు కలిసి ధైర్యం అనే సినిమా చేసారు అయితే ఈ సినిమా షూట్ చేసాక తేజ కొన్ని సీన్ లు బాగా రాలేదు మనం అనుకున్న స్టోరీ కరెక్ట్ గా లేదు మళ్ళి షూట్ చేద్దాం అంటే దానికి ప్రొడ్యూసర్ అయిన నితిన్ వాళ్ళ నాన్న ఇప్పటికే ఈ సినిమా మీద బాగా డబ్బులు పెట్టాం """/" / ఇక పెట్టడం మా వల్ల కాదు సినిమా ఎలా ఉన్న పర్లేదు రిలీజ్ చేసేద్దాం ఆడితే ఆడుతుంది లేకపోతే ప్లాప్ అవుతుంది అని చెప్పాడట దాంతో తేజ కి కోపం వచ్చి ఆ సినిమా ప్రివ్యూ చూడడానికి వచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ కి ఈ సినిమా బాగా రాలేదు ప్లాప్ అవుతుంది అని చెప్పాడంట దాంతో సినిమా డైరెక్టరే ఇలా చెప్తున్నాడు అంటే ఇక సినిమా కొనుక్కొనడం వేస్ట్ అని వాళ్లలో కొందరు వెనక్కి వెళ్లిపోయారట దింతో అలా ఎందుకు చెప్తున్నారు అని నితిన్ తేజ ని అడగడం తో """/" / ఇద్దరి మధ్య గొడవ అయిందని తెలుస్తుంది.

ఇప్పటికి వీళ్లిద్దరి మధ్య మాటలు లేవని కూడా తెలుస్తుంది.ప్రస్తుతం నితిన్ వక్కంతం వంశీ డైరెక్షన్ ఓ ఒక సినిమా చేస్తున్నాడు.

అలాగే తేజ కుడా దగ్గుబాటి అభిరామ్ తో అహింస అనే సినిమా చేస్తున్నాడు.

తేజ చాలా సంవత్సరాల తర్వాత నేనే రాజు నేనే మంత్రి సినిమాతో హిట్ కొట్టినప్పటికీ ఆ తర్వాత తీసిన సీత సినిమా ప్లాప్ అయింది దాంతో ఇప్పుడు అహింస సినిమా తో ఎలాగైనా హిట్ కొట్టి మళ్ళి సక్సెస్ సాధించాలని చూస్తున్నాడు.

Bhujangarao, Tirupattana : ఫోన్ ట్యాపింగ్ కేసులో అడిషనల్ ఎస్పీలకు కస్టడీ..!