‘రావణాసుర’పై డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఇది కంప్లీట్ అలాంటి కథ అంటూ..

మాస్ మహారాజా రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో (Director Sudheer Varma) తెరకెక్కుతున్న లేటెస్ట్ అవైటెడ్ మూవీ 'రావణాసుర'.

అభిషేక్ పిక్చర్స్, ఆర్టి టీమ్ వర్క్స్ (Ravanasura)సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదల అయిన ప్రమోషనల్ కంటెంట్ అభిమానులను బాగా ఆకట్టుకుంది.

ఈ సినిమాలో మాస్ రాజాకు జోడీగా ఐదుగురు హీరోయిన్స్ నటించారు.అను ఇమ్మాన్యుయేల్, పూజిత పొన్నాడ, దక్షా నాగర్కర్, ఫరియా అబ్దుల్లా, మేఘ ఆకాష్ లు నటిస్తుండగా.

హర్ష వర్ధన్, భీమ్స్ సిసిరోలియా సంగీతం అందిస్తున్నారు.అక్కినేని హీరో సుశాంత్ ఈ సినిమాలో విలన్ రోల్ లో నటిస్తుండగా.

ఏప్రిల్ 7న పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. """/" / ఇక ఇటీవలే టీజర్ రిలీజ్ చేయగా ట్రైలర్ కూడా త్వరలోనే రిలీజ్ కానుంది.

ఈ ట్రైలర్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు.ఇదిలా ఉండగా ఈ సినిమా డైరెక్టర్ సుధీర్ వర్మ తాజాగా ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు.

ఈ సినిమా రీమేక్ అని కొన్ని రూమర్స్ రాగా వాటిపై క్లారిటీ ఇచ్చారు.

ఈ సినిమా ఎలాంటి సినిమాకు రీమేక్ కాదని.రవితేజను దృష్టిలో పెట్టుకుని రాసుకున్న కొత్త కథ ఇది అని క్లారిటీ ఇచ్చాడు.

"""/" / దీంతో ఈ రూమర్స్ కు చెక్ పడింది.సాలిడ్ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో వేచి చూడాలి.

ఎందుకంటే రవితేజ గత రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఈ సినిమా కూడా ఇదే స్థాయిలో హిట్ అవుతుంది అని ఆశగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

ధమాకా, వాల్తేరు వీరయ్య సరసన రావణాసుర కూడా చేరుతుందో లేదో తెలియాలంటే కొద్దీ రోజు వేచి ఉండాల్సిందే.

తెలుగుదేశం పార్టీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఈడీ చార్జ్ షీట్..!!