ఆ సినిమా రిజల్ట్ వల్ల మహేష్ బాధపడ్డారు.. శ్రీనువైట్ల కామెంట్స్ వైరల్!

స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల యాక్షన్ కామెడీ సినిమాలతో ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్నారనే విషయం తెలిసిందే.

తాజాగా అలీతో సరదాగా షోలో పాల్గొన్న శ్రీనువైట్ల వ్యక్తిగతంగా వృత్తిపరంగా లైఫ్ పరవాలేదని ప్రస్తుతం తాను ఎవరికీ జవాబుదారీ కానని శ్రీనువైట్ల అన్నారు.

విష్ణు హీరోగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా ఢీ అండ్ ఢీ ప్రారంభమవుతుందని బాల్యం నుంచి డైరెక్టర్ కావాలనేది తన గోల్ అని శ్రీనువైట్ల వెల్లడించారు.

బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ప్రాణానికి ప్రాణం అనే సినిమాకు అప్రెంటిస్ గా పని చేశానని ఆ తర్వాత ఈవీవీ సత్యనారాయణ, సాగర్ దగ్గర పని చేశానని శ్రీనువైట్ల అన్నారు.

రవితేజ హీరోగా తెరకెక్కిన నీకోసం సినిమాను కేవలం 28 రోజుల్లో 38 లక్షల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించానని శ్రీనువైట్ల అన్నారు.

నీకోసం సినిమాకు ఏడు నంది అవార్డులు వచ్చాయని శ్రీనువైట్ల చెప్పుకొచ్చారు.తన డైరెక్షన్ లో ఇప్పటివరకు 17 సినిమాలు తెరకెక్కగా ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలు హిట్టయ్యాయని శ్రీనువైట్ల అన్నారు.

అమర్ అక్బర్ ఆంటోనీ రిజల్ట్ చూసి తాను షాక్ అవ్వలేదని ఆ సినిమా ప్రయోగం అని శ్రీనువైట్ల అన్నారు.

"""/"/ ఏ సినిమా అయినా సక్సెస్ సాధించడానికి కథ కారణం అని కథ బాగా లేని పక్షంలో ఎంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ నిర్మించినా సినిమాకు నష్టం తప్పదని శ్రీనువైట్ల చెప్పుకొచ్చారు.

సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా ప్రొడ్యూసర్స్ సేఫ్ గా ఉండాలని తాను భావిస్తానని శ్రీనువైట్ల పేర్కొన్నారు.

"""/"/ దూకుడు ఫలితానికి మహేష్ బాబు చాలా సంతోషించారని ఆగడు రిలీజైన తర్వాత మహేష్ తనను నిందించలేదని శ్రీనువైట్ల తెలిపారు.

తాను, మహేష్ బాబు ఆగడు సినిమాను ఎక్కువగా నమ్మామని ఆ సినిమా ఫ్లాప్ కావడంతో మహేష్ బాధ పడ్డాడని తాను కూడా బాధ పడ్డానని శ్రీనువైట్ల పేర్కొన్నారు.

ఆ ఒక్క పని చేస్తే మాత్రమే పూరీ జగన్నాథ్ కు హిట్లు.. మారాల్సిన తరుణం ఆసన్నమైందా?