జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ డేట్స్ కోసం చూస్తున్న తమిళ్ దర్శకుడు

సినిమాటోగ్రాఫర్ గా కెరియర్ ప్రారంభించి తరువాత శౌర్యం సినిమాతో టాలీవుడ్ లో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు.

గోపీచంద్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది.తరువాత శంఖం సినిమా చేశారు.

ఆ సినిమా ఎవరేజ్ టాక్ తెచ్చుకుంది.ఇదిలా ఉంటే ఈ రెండు సినిమాల తర్వాత కోలీవుడ్ లోకి వెళ్ళిపోయి అక్కడ స్టార్ హీరో అజిత్ తో వరుస సినిమాలు చేశాడు.

అజిత్ కి వరుస హిట్స్ అందించిడు స్టార్ దర్శకుడు మారిపోయాడు.ప్రస్తుతం రజినీకాంత్ హీరోగా అన్నాత్తై సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.ఎక్కువగా యాక్షన్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో సినిమాలు చేసే శివ దృష్టి మళ్ళీ టాలీవుడ్ పై పడింది.

రజినీకాంత్ తో చేస్తున్న అన్నాత్తై సినిమా తర్వాత స్ట్రైట్ తెలుగు సినిమా చేయాలని అనుకుంటున్నారు.

దానికోసం ఇప్పటికే కథ కూడా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది.ఈ విషయంపై ఓ మీడియా ఇంటర్వ్యూలో దర్శకుడు శివ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

ప్రస్తుతం తాను తీస్తున్న సినిమాలు పూర్తయ్యాక మళ్ళీ తెలుగులో సినిమా తీయ్యాలిఅనుకుంటున్నా అని వెల్లడించాడు.

అయితే టాలీవుడ్ లో అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా తియ్యలన్నది తన ఆలోచన అని చెప్పుకొచ్చాడు.

వారి డేట్స్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు.అయితే ప్రస్తుతం అల్లు అర్జున్, తారక్ ఇద్దరూ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

ఈ నేపధ్యంలో వారితో సినిమా చేయాలంటే ముందుగానే స్టొరీ ఫైనల్ చేసుకొని కనీసం రెండేళ్ళు వెయిట్ చేయాల్సి ఉంటుంది.

మరి శివ అంత గ్యాప్ తీసుకొని తెలుగు హీరోలతో సినిమా చేస్తాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

రోజు ఈ విధంగా బ్రష్ చేశారంటే మీ దంతాలు తెల్లగా దృఢంగా మారడం ఖాయం!