లైగర్ తర్వాత పూరీ సినిమా ఎవరితో..?
TeluguStop.com
డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో లైగర్ సినిమా చేస్తున్నాడు.
పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలో అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుంది.
ఇక ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ సినిమా శివ నిర్వాణ డైరక్షన్ లో ఫిక్స్ చేసుకున్నాడు.
అయితే పూరీ జగన్నాథ్ తన తర్వాత సినిమా ఎవరితో చేస్తాడు అన్నది క్లారిటీ రాలేదు.
అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం లైగర్ తర్వాత పూరీ జగనాథ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో సినిమా చేస్తాడని తెలుస్తుంది.
రామ్ తో ఆల్రెడీ ఇస్మార్ట్ శంకర్ సినిమా తీశాడు పూరీ.ఆ సినిమాతోనే అటు రామ్ కు ఇటు తనకు సూపర్ హిట్ వచ్చేలా చేసుకున్నాడు.
రామ్, పూరీ కాంబో మరోసారి ఇద్దరి కాంబో సంచలనానికి రెడీ అవుతుందని తెలుస్తుంది.
ప్రస్తుతం రామ్ లింగుసామి డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు.ఆ సినిమా పూర్తి కాగానే పూరీ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది.
అయితే అది ఇస్మార్ట్ శంకర్ సీక్వల్ గా వస్తుందా లేక కొత్త కథతో వస్తారా అన్నది తెలియాల్సి ఉంది.
సీఎం జగన్ పై రాయి దాడి ఘటన ఆరోపణలపై బోండా ఉమ రియాక్షన్..!!