మరీ ఇంత చెడ్డ పేరు తెచ్చుకున్నావ్ ఏంటి పరశురామ్‌?

2008 సంవత్సరంలో యువత( Yuvatha ) అనే చిన్న చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దర్శకుడిగా పరిచయం అయిన పరశురాం( Parasuram ) ఆ తర్వాత వెంటనే మాస్ మహారాజా రవితేజ హీరోగా ఆంజనేయులు అనే సినిమాను రూపొందించాడు.

మొదటి రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో దర్శకుడు పరశురాం కి ఇండస్ట్రీలో మంచి పేరు లభించింది.

ఆ వెంటనే సోలో సినిమాని రూపొందించాడు.ఆ సినిమా నిరాశ పర్చడంతో కాస్త గ్యాప్ తీసుకొని మళ్ళీ రవితేజతో సారొచ్చారు అనే సినిమాని తెరకెక్కించాడు.

ఆ సినిమా కూడా నిరాశ పరిచింది.దాంతో ఏకంగా నాలుగు సంవత్సరాల పాటు దర్శకత్వానికి దూరంగా ఉన్నాడు.

ఎట్టకేలకు 2016 సంవత్సరంలో శ్రీరస్తు శుభమస్తు అనే సినిమా ను చేశాడు.అది కూడా నిరాశ పర్చింది.

2018 లో గీతా గోవిందం సినిమా( Geetha Govindam ) ను చేయగా సూపర్ డూపర్ హిట్ సొంతం చేసుకుంది.

"""/"/ ఆ సినిమా సూపర్ హిట్ అయిన కూడా సరైన నిర్ణయం తీసుకోక పోవడం వల్ల 2022 వరకు తదుపరి సినిమా కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది.

2022 సంవత్సరంలో మహేష్ బాబుతో తెరకెక్కించిన సర్కారు వారి పాట( Sarkaru Vaari Paata ( ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

మహేష్ బాబు తో సినిమా కు ముందు నాగ చైతన్యతో ఒక సినిమా ను పరశురాం తెరకెక్కించాలనుకున్నాడు.

అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది.నాగ చైతన్య తో సినిమా ప్రారంభించాలి అనుకుంటుండగా మహేష్ బాబు( Mahesh Babu ( తో సినిమా ఆఫర్ రావడం తో ఆ సినిమా ను పక్కన పెట్టేసి మహేష్ బాబు సినిమా ని చేశాడు.

"""/"/ మహేష్ బాబు సర్కార్ వారి పాట సినిమా పూర్తి అయిన తర్వాత నాగ చైతన్య( Naga Chaitanya ) తో మళ్ళీ సినిమా ను మొదలు పెట్టేందుకు పరుశురాం రెడీ అయ్యాడు.

నాగ చైతన్య కూడా ఓకే చెప్పాడు.కానీ ఇంతలో దిల్ రాజు, విజయ్ దేవరకొండ నుండి పిలుపు రావడంతో మరో సారి నాగచైతన్య సినిమా ను పక్కన పెట్టాడు.

పెద్ద ఆఫర్ వచ్చినప్పుడు చిన్న ఆఫర్ ని పక్కన పెట్టడం ఈయన కి అలవాటు అంటూ కొందరు అభిప్రాయం చేస్తున్నారు.

అల్లు అరవింద్( Allu Aravind ) ఏకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి పరశురాంపై తీవ్ర విమర్శలు చేయాలనుకున్నాడు.

కానీ ఇతర నిర్మాతల విజ్ఞప్తితో ఆగిపోయాడు.నాగ చైతన్య ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ దర్శకుడి గురించి అస్సలు మాట్లాడటమే ఇష్టం లేదు అన్నట్లుగా వ్యాఖ్యలు చేశాడు.

ఇలాంటి చెడ్డ పేరును పరుశురాం ఇండస్ట్రీలో దక్కించుకోవడం దారుణం.

ఒమన్ సముద్రంలో మునిగిన చమురు నౌక .. 16 మంది గల్లంతు, అందులో 13 మంది భారతీయులే