ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పిన కోబ్రా డైరెక్టర్.. అసలేమైందంటే?

కోలీవుడ్ స్టార్ హీరో నటించిన విక్రమ్ తాజాగా నటించిన చిత్రం కోబ్రా.అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విక్రమ్ సరసన శ్రీనిధి శెట్టి నటించారు.

ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 31వ తేదీ విడుదల అయ్యి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

ఇలా ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ పలుచోట్ల ప్రేక్షకులు ఈ సినిమాపై విమర్శలు చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే సినిమా నిడివి చాలా ఎక్కువగా ఉంది అంటూ కామెంట్లు చేయగా ప్రేక్షకుల అభ్యర్థనల ప్రకారం ఈ సినిమాని 20 నిమిషాలు కట్ చేసి ప్రదర్శిస్తున్నారు.

ఇకపోతే తాజాగా ఈ సినిమాపై వస్తున్నటువంటి నెగిటివ్ కామెంట్స్ పై డైరెక్టర్ అజయ్ స్పందించారు.

తాజాగా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ తో ముచ్చటించిన ఈయన నేటిజన్స్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

ఈ క్రమంలోనే ఓ నేటిజన్ కామెంట్ చేస్తూ కథనం బాగున్నప్పటికీ క్లైమాక్స్ కాస్త నిరాశ జనకంగా ఉంది అంటూ కామెంట్ చేశారు.

ఈ కామెంట్ పై డైరెక్టర్ స్పందిస్తూ పోలీసుల నుంచి తప్పించుకున్న ఒక నేరస్థుడు విదేశాలలో స్వేచ్ఛగా తిరుగుతున్నట్లు క్లైమాక్స్ రాయవచ్చు కానీ నేరస్తుడిని అలా స్వేచ్ఛగా చూపించడం సరేంది కాదంటూ ఈయన సమాధానం చెప్పారు.

"""/"/ ఇక మరొక నెటిజన్ ఈ సినిమా స్క్రీన్ ప్లే విషయంపై స్పందిస్తూ స్క్రీన్ ప్లే మొత్తం గందరగోళంగా ఉంది అంటూ కామెంట్ చేశారు.

ఇలా నెటిజన్ కామెంట్ చేసిన విషయం పై ఈయన స్పందిస్తూ మిమ్మల్ని గందరగోళానికి గురి చేసినందుకు క్షమాపణలు చెబుతున్న అంటూ ప్రేక్షకులకు సారీ చెప్పారు.

ప్రతిక్షణం ఉత్కంఠతకు గురి చేసిన సినిమాలను చూడటానికి ఒక సాధారణ ప్రేక్షకుడిగా నేను ఇష్టపడతాను.

అందుకే కోబ్రా సినిమాని తెరకెక్కించానని వీలైతే మరొకసారి ఈసినిమా చూడండి కచ్చితంగా మీకు నచ్చుతుంది అంటూ ఈ సందర్భంగా ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ తో ముచ్చటిస్తూ ఈయన సినిమా గురించి చేసిన కామెంట్లపై స్పందిస్తూ సమాధానం చెప్పారు.

డ్రామాలొద్దు .. ఇమ్మిగ్రేషన్ విధానాలపై ట్రంప్‌కు షాకిచ్చేలా కమలా హారిస్ ప్రకటన