రాశి ఖన్నా మీద మారుతి స్పెషల్ ఇంట్రెస్ట్..!

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరక్టర్ మారుతి డైరక్షన్ లో సినిమా అంటే మినిమం గ్యారెంటీ అన్నట్టే లెక్క.

లాస్ట్ ఇయర్ కరోనా నేపథ్యంతో వచ్చిన మంచి రోజులు వచ్చాయి సినిమాతో హిట్ అందుకున్న మారుతి మ్యాచో హీరో గోపీచంద్ హీరోగా పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్నాడు.

యువి క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో గోపీచంద్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది.

సినిమా ట్రైలర్ కూడా రీసెంట్ గా రిలీజ్ చేశారు.ఈ ట్రైలర్ చూశాక మారుతికి హీరోయిన్ రాశి ఖన్నా మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని అనిపిస్తుంది.

అలా ఎందుకు అంటే రాశి ఖన్నా హీరోయిన్ గా నటించిన ప్రతిరోజు పండుగే సినిమాని కూడా మారుతి డైరెక్ట్ చేశాడు.

ఆ సినిమాలో కూడా ఆమె పాత్రకి స్పెషల్ కేర్ తీసుకున్నాడు.ఆ సినిమాలో ఏంజెల్ ఆర్నా అంటూ హీరోయిన్ పాత్రకు స్పెషల్ క్రేజ్ తెచ్చాడు మారుతి.

ఇక పక్కా కమర్షియల్ సినిమాలో కూడా రాశి ఖన్నా పాత్రకి స్పెషల్ కేర్ తీసుకున్నట్టు తెలుస్తుంది.

ట్రైలర్ చూస్తేనే మారుతి రాశి ఖన్నా పాత్ర మీద ఎంత ఫోకస్ పెట్టాడో అర్ధమవుతుంది.

గోపీచంద్ ఈ సినిమాతో ఖచ్చితంగా హిట్ కొట్టడం గ్యారెంటీ అనేలా ఉన్నాడు.

జగన్ తిరుమల పర్యటన… జనసేన దూరం