‘ఖైదీ’ సీక్వెల్ పై లోకేష్ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ఆ సినిమా తర్వాత స్టార్ట్ చేస్తానంటూ..

సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ( Director Lokesh Kanagaraj ) అంటే ఇప్పుడు పాన్ ఇండియన్ వ్యాప్తంగా ఫేమస్ అనే చెప్పాలి.

ఈయన ఒకప్పుడు కేవలం కోలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే సుపరిచితం.కానీ ఇప్పుడు అలా కాదు.

ఈయన మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ను ఆడియెన్స్ కు అందించి తన సినిమాలతో కొత్త ప్రపంచంలోకి తీసుకుని వెళతాడు.

అందుకే ఈయన సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది.కమల్ హాసన్ తో 'విక్రమ్' సినిమా తీసిన తర్వాత ఈయన క్రేజ్ అమాంతం పెరిగింది.

ఇక ఈ సినిమా తర్వాత ఈయన చేస్తున్న సినిమాలపై మరింత హైప్ పెరుగుతుంది.

మరి ఈయన తీసిన సినిమాల్లో సూపర్ హిట్ మూవీ ''ఖైదీ'' ఒకటి.ఈ సినిమా ఆడియెన్స్ ను బాగా అలరించింది.

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తమిళ్ హీరో కార్తీ ( Karthi ) హీరోగా తెరకెక్కిన ఖైదీ సెన్సేషనల్ హిట్ అయ్యింది.

"""/" / ఇక ఈ సినిమాకు సీక్వెల్ ( Kaithi 2 ) కోసం మూవీ లవర్స్ అంత ఎదురు చూస్తున్నారు.

తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది.

అందుకే సీక్వెల్ పై అంచనాలు బాగానే ఉన్నాయి.మరి తాజాగా లోకేష్ ఈ సినిమా సీక్వెల్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు.

ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ జోసెఫ్ తో 'లియో'( Leo ) సినిమా చేస్తున్నాడు.

అక్టోబర్ 19న దసరా కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా లోకేష్ ఖైదీ సీక్వెల్ పై కామెంట్స్ చేసారు.

లియో రిలీజ్ తర్వాత లోకేష్ రజినీకాంత్ తో 'తలైవర్ 171'( Thalaivar 171 ) సినిమాను చేయనున్నాడు.

ఈ ప్రాజెక్ట్ కూడా పూర్తి అయ్యాక అప్పుడు ఖైదీ సీక్వెల్ స్టార్ట్ చేస్తాను అని ఖైదీ సిరీస్ తనకు ఎంతో ప్రత్యేకం అని ఎందుకంటే తన సినిమాటిక్ యూనివర్స్ అంత మొదలైంది ఈ సినిమా నుండే అని తనకు ఉన్న కమిట్మెంట్స్ కారణంగా ఈ సీక్వెల్ లేట్ అవుతూ వస్తుంది అని ఈయన చెప్పుకొచ్చాడు.

అకీరా నందన్ సినీ ఎంట్రీ గురించి నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏం చెప్పారంటే?