మెగా హీరోలతో కొరటాల మెగా బ్లాక్ బస్టర్ కొడతాడా?

మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్ లలో కొరటాల శివ ఒకరు.

ఈయన మొదటి నుండి అందరి కంటే డిఫెరెంట్ గా సినిమాలు చేస్తూ వరుస విజయాలు సాధించాడు.

ఈయన సామజిక అంశాలను ప్రధానంగా తీసుకుని దానికి కమర్షియల్ హంగుల్ని జోడించి తెరకెక్కిస్తూ ఉంటాడు.

ఈయన మొదటి సినిమా నుండి ఇప్పటి వరకు ప్రతి సినిమాలో ఒక సామాజిక అంశాన్ని తెరమీదకు తెస్తూ ఉంటాడు.

కొరటాల శివ మొదటి సినిమా ప్రభాస్ తో మిర్చి తీసాడు.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

మన ఇండస్ట్రీలో వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్న స్టార్ డైరెక్టర్ గా కొరటాల రికార్డ్ క్రియేట్ చేసాడు.

ఈ సినిమా తర్వాత మహేష్ బాబు తో శ్రీమంతుడు చేసాడు.ఇది కొరటాల కెరీర్ లోనే కాదు మహేష్ కెరీర్ లో కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఆ తర్వాత ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్, మళ్ళీ మహేష్ బాబు తో భరత్ అనే నేను సినిమాలు చేసాడు.

ఈ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి.ఇలా ఈయన వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు.

ఇక ఇప్పుడు మెగా హీరోలతో సినిమాలు చేస్తున్నాడు.ప్రెసెంట్ చిరంజీవి, రామ్ చరణ్ తో కలిసి టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ ఆచార్య సినిమా చేసాడు.

ఈ సినిమాను రిలీజ్ కు రెడీగా ఉంచాడు.ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది.

ఇందులో రామ్ చరణ్ సిద్ధ అనే పవర్ ఫుల్ రోల్ లో నటించాడు.

"""/"/ చిరు కి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తే రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటించింది.

వీరిద్దరూ కూడా ఈ సినిమాలో నటించడం వల్ల ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.

అయితే ఇప్పటికే అంచనాలు పీక్స్ లో ఉన్న ఈ సినిమాతో కొరటాల బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కొరటాల నుండి దాదాపు 4 ఏళ్ల తరవాత ఈ సినిమా వస్తుంది. """/"/ కొరటాల మెగా హీరోలను కలిపాడు కాబట్టి ఆయనకు ఫ్రీడమ్ ఇచ్చారా లేదా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్స్ ప్రశ్న.

ఫ్రీడమ్ ఇస్తే కనుక కొరటాల మార్క్ కి మెగా పవర్ కూడా కలిసి ఈ సినిమా నెక్స్ట్ లెవల్ లో ఉండే అవకాశం ఉంది.

అయితే ఫ్రీడమ్ ఇవ్వకుండా మెగా హీరోల ఇంవోల్మెంట్ ఉంటే మాత్రం ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందో లేదో చెప్పడం కష్టమే.

రోజుకు ప‌ది న‌ల్ల ఎండు ద్రాక్ష తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?