కార్తికేయ సీక్వెల్ పక్కన పెట్టి లేడీ ఓరియెంటెడ్ సినిమా స్టార్ట్ చేసిన దర్శకుడు

కార్తికేయ లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాతో దర్శకుడుగా తెరంగేట్రం చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి చందూ మొండేటి.

ఈ దర్శకుడు చేసిన సినిమాలు తక్కువే అయిన మంచి టాలెంటెడ్ అనే పేరు మాత్రం తెచ్చుకున్నాడు.

కమర్షియల్ ఎలిమెంట్స్ అంటూ అతన్ని డిస్టర్బ్ చేయకపోతే అద్భుతమైన కథలని తెరపై ఆవిష్కరించే సామర్ధ్యం అతని సొంతం అనే అభిప్రాయం ఇండస్ట్రీలో ఉంది.

ఇక ఈ యువ దర్శకుడు తన నాలుగో చిత్రంగా కార్తికేయ సీక్వెల్ ని ఆ మధ్య ప్రకటించాడు.

ఏకంగా 25 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించడానికి రంగం సిద్ధం చేశారు.

కాన్సెప్ట్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.ఇందులో మైథాలజీ ఎలిమెంట్ ని సైన్స్ ని కనెక్ట్ చేయబోతున్నట్లు కాన్సెప్ట్ ద్వారా తెలియజేశారు.

ఇదిలా ఉంటే ఈ భారీ బడ్జెట్ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది అనేది దర్శకుడు ప్రకటించలేదు.

అయితే ఊహించని విధంగా చందూ మొండేటి ఈ కార్తికేయ సీక్వెల్ ని పక్కన పెట్టి తక్కువ బడ్జెట్ లో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళాడు.

ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ కూడా మొదలు పెట్టేశాడు.నివేతా పెతురాజ్ ఈ సినిమాలో లీడ్ రోల్ లో నటిస్తుంది.

ఇక థ్రిల్లర్ కాన్సెప్ట్ తోనే ఈ సినిమాని కూడా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తుంది.

ఇక సినిమా గురించి పూర్తి వివరాలు తెలియకపోయిన హైదరాబాద్ లో షూటింగ్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తుంది.

ఇక ఈ సినిమాని తెలుగు, తమిళ బాషలలో తెరకెక్కించనున్నట్లు సమాచారం.అయితే లేడీ ఓరియెంటెడ్ సినిమా స్టార్ట్ చేసిన చందూ కార్తికేయ సినిమాని పక్కన పెట్టాడా లేక భారీ బడ్జెట్ సినిమా కాబట్టి కొంత టైం తీసుకొని కరోనా పరిస్థితులు కంట్రోల్ అయ్యాక చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది.

ఊహించని యాక్టర్లతో జతకట్టి షాకిచ్చిన స్టార్ హీరోయిన్లు వీళ్లే..