డైరెక్టర్ చందు మొండేటి కి పెళ్లి చేసింది ఎవరో తెలుసా..?

డైరెక్టర్ చందు మొండేటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈయన తీసిన కార్తికేయ, కార్తికేయ 2 సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నాయి.

చందు మొండేటి కెరియర్ మొదట్లో డైరెక్టర్ పరుశురాం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు.

అదే టైం లో తన లవ్ మ్యాటరు తెలుసుకున్న పరుశురాం చందు మొండేటి కి ఆ అమ్మాయి కి దగ్గర ఉండి పెళ్లి చేసాడు.

చందు మొండేటి పెళ్లి అయ్యాకే డైరెక్టర్ అయ్యాడు.రీసెంట్ గా చందు మొండేటి తీసిన కార్తికేయ 2 సినిమా పాన్ ఇండియా సినిమా గా దేశం మొత్తం విపరీతంగా ఆడిందీ.

ఈ సినిమాని చూసిన నార్త్ ఆడియన్స్ ఈ సినిమా కి ఫిదా అయిపోయారు.

చందు మొండేటి కెరియర్ లోనే ఈ సినిమా బారి హిట్ గా నిలిచింది.

"""/"/ అయితే చందు మొండేటి తను లవ్ చేసిన విషయాన్ని ఎవరికి చెప్పకుండా చాలా రోజుల పాటు సీక్రెట్ గా మెయింటైన్ చేశాడట అది చివరికి పరుశురాం తెలుసుకొని అతనిది నిజమైన ప్రేమేనా, కాదా అనే విషయం మీద క్లారిటీ లేకపోవటంతో కొద్ది రోజులు అతన్ని అబ్జర్వ్ చేశాడట.

అతని ప్రేమలో నిజాయితీని గుర్తించిన పరుశురాం చందు మొండేటి ప్రేమించిన అమ్మాయితో అతనికి పెళ్లి చేశారట పరుశురాం ఆయన భార్య ఇద్దరు దగ్గర ఉండి వీళ్ళ పెళ్లి చేశారని చందు మొండేటి చాలాసార్లు చెప్పాడు.

"""/"/ ప్రస్తుతం చందు మొండేటి వేరే సినిమా ఏది కమిట్ అవ్వకుండా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది అలాగే ఫ్యూచర్ లో కార్తికేయ 3 ప్రాజెక్ట్ ని కూడా చేయబోతున్నాడనే విషయాన్ని ఆయనే చాలా సార్లు తెలియజేశాడు.

ఈయన చేసిన సినిమాల్లో సవ్యసాచి ఒక్కటి మినహా ఇస్తే మిగిలిన మూడు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.

దేవరకు పోటీగా రావడమే సత్యం సుందరంకు శాపమా.. మంచి సినిమాకు ఇలాంటి పరిస్థితా?