కాంతార సినిమా క్లైమాక్స్ బోరింగ్.. సినిమా బాలేదన్న నిర్మాత?

కన్నడ హీరో రిషబ్ శెట్టి హీరోగా ఆయన దర్శకత్వంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కాంతార.

ఈ సినిమా సెప్టెంబర్ 30 వ తేదీ థియేటర్లలో విడుదలైంది.కన్నడ చిత్ర పరిశ్రమలోఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా వివిధ భాషలలో కూడా విడుదల అయ్యి ఎంతో ఆదరాభిమానాలను సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమా చూసినటువంటి ఎంతోమంది సినీ ప్రముఖులు సినిమాపై పెద్ద ఎత్తున ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

అయితే తాజాగా ఓ నిర్మాత మాత్రం ఈ సినిమా పై స్పందిస్తూ సినిమా అసలు ఏ మాత్రం బాగోలేదని క్లైమాక్స్ చాలా బోరింగ్ గా ఉందంటూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

దేశవ్యాప్తంగా కాంతార సినిమాకి ప్రజలు సినీ ప్రముఖులు బ్రహ్మరథం పడుతున్నారు.ఈ క్రమంలోనే నిర్మాత అభిరూప్ బసు ఈ సినిమా గురించి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

ఈ సందర్భంగా అభిరూప్ మాట్లాడుతూ.కాంతార సినిమా ప్రజల తెలివితేటలను అపహాస్యం చేసిందంటూ ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సినిమా ప్రజల జీవితాల్లో దైవ జోక్యాన్ని విశ్వసించేలా చేస్తుందని తెలిపారు.సినిమా కాన్సెప్ట్ గురించి చెప్పాల్సి వస్తే కథ చాలా పేలవంగా తయారైందని ఈయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

"""/"/ ఈ సినిమాలో అసలు పాత్రకు ప్రామాణికత లేదు.ఇక ఈ సినిమాపై ఇప్పటికే ఎంతోమంది మాట్లాడుతూ క్లైమాక్స్ ఎంతో అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చారు.

అయితే నాకు మాత్రం క్లైమాక్స్ ఏ మాత్రం నచ్చలేదని చాలా బోర్ అనిపించింది అంటూ అబిరూప్ తెలిపారు.

ఈ సినిమాని పాత స్టోరీ లైన్ తో కొత్తగా తీసారంటూ ఈయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.

ఈ సినిమా తనకు నచ్చలేదని చెప్పడంతో ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మానవులు తయారు చేసిన అత్యంత ఖరీదైన వస్తువు.. ఏంటో తెలిస్తే..