నాకు రూపాయి కూడా మిగలదు.. వైరల్ అవుతున్న దిల్ రాజు షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని కమర్షియల్ ప్రొడ్యూసర్స్ లో దిల్ రాజు ముందువరసలో ఉంటారని చాలామంది భావిస్తారు.

సినిమాల ద్వారా దిల్ రాజు ఊహించని మొత్తం సంపాదించారు.తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే దిశగా దిల్ రాజు నిర్ణయాలు ఉంటాయని చాలామంది భావిస్తారు.

లవ్ స్టోరీ సినిమాను నేను తెలుగులో విడుదల చేస్తున్నా నాకు ఆ సినిమా ద్వారా రూపాయి కూడా మిగలదని ఆయన చెప్పుకొచ్చారు.

నాకు డబ్బులు వద్దని డబ్బులతో ఏం చేసుకుంటామని ఆయన తెలిపారు.అయితే దిల్ రాజు మాటలను నమ్మలేమని చాలామంది చెబుతున్నారు.

దిల్ రాజు మాటలకు, చేతలకు పొంతన ఉండదని చాలామంది కామెంట్లు చేస్తున్నారు.ప్రేక్షకుల దృష్టిలో తనపై అభిప్రాయం మారాలనే ఆలోచనతో దిల్ రాజు ఈ విధంగా కామెంట్లు చేసి ఉండవచ్చని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

"""/"/ రూపాయి కూడా మిగలకుండానే దిల్ రాజు వందల కోట్లు సంపాదించారా? అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

దిల్ రాజు ఏ తప్పు చేయని పక్షంలో ఇతర నిర్మాతలకు ఆయనపై ఆరోపణలు చేయాల్సిన అవసరం ఏముంటుందని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.

దిల్ రాజు కామెంట్ల గురించి ఇతర నిర్మాతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

దిల్ రాజు ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ లను నిర్మిస్తున్నారు.పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో భారీగా లాభాలు సొంతమవుతాయని భావించి దిల్ రాజు భావిస్తున్నారు.

విజయ్ తో దిల్ రాజు నిర్మిస్తున్న వారసుడు సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.

చరణ్ శంకర్ కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

ప్రభాస్ కల్కి విషయం లో బాలీవుడ్ కి ఎందుకు భయం.?