మా గురించి అలా రాయకండి.. స్టేజిపైనే దిల్ రాజు ఎమోషనల్!
TeluguStop.com
టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు గురించి అందరికీ తెలిసిందే.తెలుగులో ఎన్నో సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు దిల్ రాజు.
ఇది ఇలా ఉంటే తాజాగా దిల్ రాజు ఒక సక్సెస్ మీట్ లో భాగంగా పాల్గొని,అలా రాయకండి అంటూ స్టేజ్ పై ఎమోషనల్ అయ్యాడు.
అసలేం జరిగిందంటే.టాలీవుడ్ హీరో నిఖిల్ హీరోగా నటించిన తాజా చిత్రం కార్తికేయ 2.
తాజాగా ఈ సినిమా విడుదల అయ్యి మంచి సక్సెస్ ను అందుకున్న విషయం తెలిసిందే.
సినిమా మంచి సక్సెస్ అయిన సందర్భంగా చిత్ర బృందం తాజాగా హైదరాబాదులో సక్సెస్ మీట్ ను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన దిల్ రాజు స్టేజ్ పై మాట్లాడుతూ.కార్తికేయ2 సినిమా రిలీజ్కు ముందు చాలా సార్లు హీరో నిఖిల్ నాతో మాట్లాడారు.
జులై 8న థాంక్యూ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకున్నాము.కానీ కుదర్లేదు.
దీంతో అదే నెల 22న మా సినిమాను విడుదల చేయాలని భావించాం.ఇదే విషయాన్ని కార్తికేయ2 నిర్మాతల్లో ఒక్కరైన వివేక్తో చెప్పాను.
మీరు అల్రెడీ జులై 22కు విడుదల చేస్తామని పోస్టర్ వేసుకున్నారు కదా.మాకు ఏమైనా అవకాశం ఇస్తారా అని వివేక్ని అడిగాను.
మా హీరో, డైరెక్టర్తో మాట్లాడి చెప్తా అని తర్వాత నిఖిల్, చందు నన్ను కలిసేందుకు దిల్ రాజు ఇంటికి వెళ్ళారట.
అయితే వారితో మాట్లాడుకొని సినిమా విడుదల తేదిని మార్చుకున్నాం.అక్కడితో సమస్య తీరింది.
ఆగస్ట్ 12న కార్తికేయ2 విడుదల చేస్తామని అనుకున్నారట. """/" /
అయితే ఆ విషయంలో తాను నేను సపోర్ట్ ఇస్తానని చెప్పరట.
ఇలా చర్చలు జరుతుండగానే కొందరు దిల్ రాజు సినిమాను తొక్కేస్తున్నాడు అంటూ ఏవేవో వార్తలు రాసేశారు.
ఇక్కడ ఎవరు ఎవరి సినిమాని తొక్కరు.అది రాసేవాళ్లకి, చదివేవాళ్లకు ఉండాల్సిన మినిమం కామన్సెన్స్.
అయితే ఇక్కడ ఎవరి సినిమా ఆడినా మేమంతా ఆనందపడతాం.ఒక్క సినిమా సక్సెస్ మాకు ఇంకో సినిమా తీయడానికి ఊపిరిని పోస్తుందట.
అంతేకానీ మాలో మాకు ఏదో క్రియేట్ చేస్తూ.మీ క్లిక్స్ కోసం, వ్యూస్ కోసం మమల్ని బలిపశుల్ని చేయ్యొద్దు.
వాస్తవాలు రాయండి.తెలియకుంటే తెలుసుకొని చెప్పండి.
సినిమా కోసం నేను ప్రాణం ఇస్తాను.పాడు చేయాలని ఎప్పుడూ అనుకోను.
డబ్బులు నష్టపోయి కూడా సినిమాలు విడుదల చేశాను.ఇవన్నీ మీకు తెలియదు అంటూ దిల్రాజు కాస్త ఎమోషనల్గా మాట్లాడారు.