ఏపీలో రెండోరోజు పెన్షన్‎దారుల కష్టాలు..!

ఏపీలో రెండో రోజు పెన్షన్‎దారుల కష్టాలు కొనసాగుతున్నాయి.ఎన్నికల కమిషన్(Election Commission) ఆదేశాల మేరకు ఈనెల ఫించన్ నగదును రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది.

వాలంటీర్ల సేవలు నిలిచిపోవడంతో ఖాతాల్లో డబ్బులు తీసుకునేందుకు వృద్ధులు, దివ్యాంగులు (Elderly , Disabled)బ్యాంకులకు బారులు తీరారు.

మండుటెండలో బ్యాంకుల చుట్టూ తిప్పుతున్నారంటూ పెన్షన్‎దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు కేవైసీ అప్డేట్(KYC Update) కాని లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అలాగే కొన్ని ప్రాంతాల్లోని బ్యాంకుల్లో సర్వర్లు పని చేయకపోవడంతో బ్యాంకు వద్దే పడిగాపులు పడుతున్న పరిస్థితి నెలకొంది.