Peddapalli Congress : పెద్దపల్లి కాంగ్రెస్‎లో ఎంపీ టికెట్ ముసలం..!

పెద్దపల్లి కాంగ్రెస్‎లో( Congress ) ముసలం ముదురుతోంది.ఎంపీ టికెట్( MP Ticket ) వ్యవహారంలో వివాదం రాజుకుంది.

కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ కుమారుడు గడ్డం వంశీకి( Gaddam Vamsi ) పెద్దపల్లి ఎంపీ టికెట్ దక్కింది.

ఈ క్రమంలో వంశీకి టికెట్ ఇవ్వడంపై నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు.ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల వారికి టికెట్లు కేటాయించడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు పెద్దపల్లి ఎంపీ టికెట్ ను మాదిగ సామాజిక వర్గానికి కేటాయించాలని మరో వర్గం నేతలు డిమాండ్ చేస్తున్నారు.

నియోజకవర్గంలోని సొంత పార్టీ నేతల నుంచి అనూహ్యంగా వ్యతిరేకత రావడంతో వివేక్, వంశీ టెన్షన్ పడుతున్నారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన నేతలు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో( Mallikarjuna Kharge ) భేటీ అయ్యారని సమాచారం.

నెలకి లక్షన్నర సేవ్ చేస్తున్న కపుల్.. కానీ నచ్చిన ఇల్లు కొనలేని దుస్థితి..?