వారి రాకతో సంజయ్ ఇమేజ్ పెరిగిందా...?
TeluguStop.com
ఇప్పుడు తెలంగాణలో బండి సంజయ్ పేరు మార్మోగి పోతోంది.మొన్నటి దాకా బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పేరు బాగా హల్ చల్ చేసింది.
ఒక రకంగా చెప్పాలంటే దేశ రాజకీయాలను ఆకర్షించారు .కానీ ఎప్పుడైతే బండి సంజయ్ తన క్యాంపు ఆఫీసులో ఉద్యోగుల బదిలీల అంశంలో దీక్ష చేస్తుంటే పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి జైలుకు తరలించారో.
అప్పటి నుంచే ప్రజల దృష్టి, దేశ రాజకీయాల దృష్టి మొత్తం ఆయన మీదకు మళ్లింది.
పైగా అన్ని వర్గాల నుంచి సంజయ్కు మద్దతు పెరిగింది.ఇక అటు ఉద్యోగ సంఘాల నుంచి కూడా ఆయనకు ఫుల్ సపోర్టు వస్తోంది.
పైగా చత్తీస్ ఘడ్ మాజీ సీఎం రమణ్ సింగ్ వచ్చి ఆయన్ను పరామర్శించారు.
ఇక ఎట్టకేలకు బెయిల్ మీద విడుదల అయిన సంజయ్ను పరామర్శించేందుకు మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ రావడం ఆయన ఇమేజ్ను మరింత పెంచేసింది.
ఒక రాష్ట్ర అధ్యక్షుడికి ఇలా అన్నిరాష్ట్రాల నుంచి ఫుల్ సపోర్టు రావడం అంటే ఆయన్ను బలమైన నేతగా మార్చేయడమే అవుతుంది.
ఇదే విషయం ఇప్పుడు ఆయన్ను బీజేపీలో బలమైన నేతగా మార్చేసింది. """/" /
ఎందుకంటే గతంలో రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన కిషన్రెడ్డికి గానీ లేదంటే లక్ష్మణ్ కు గానీ ఇంతటి గౌరవం దక్కలేదు.
ఇప్పుడు సంజయ్ కోసం ఇలా అన్ని రాష్ట్రాల బీజేపీ నేతలు కలిసి రావడం అంటే మామూలు విషయం కాదు.
ఇప్పుడు ఆయన కోరుకున్నట్టు గానే కావాల్సినంత పాపులారిటీ వచ్చేసింది.బీజేపీలో ఇన్ని రోజులు ఈటల రాజేందర్ పేరు బలంగా వినిపిస్తే.
ఇప్పుడు ఆయన్ను అధిగమించేసి బండి సంజయ్ మరోసారి ఆయన ఇమేజ్ ను పెంచేసుకున్నారు.
అంటే రాజకీయంగా సంజయ్ పేరు మరోసారి మార్మోగుతోందన్నమాట.
చిన్నపిల్లని కాల్చేసిన యూఎస్ మహిళ.. షాకింగ్ వీడియో వైరల్..