షర్మిల పార్టీ ప్రకటనకు ముందే వైఎస్ ఫ్యాన్స్తో నిండిపోతోంది.ఇతర పార్టీల నుంచి షర్మిల పార్టీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి.
దీంతో లోటస్ పాండ్.ఫ్యాన్స్ పాండ్గా మారింది.
షర్మిలను సామాన్యులు మాత్రమే కాదు.సెలబ్రెటీలు సైతం కలుస్తున్నారు.
పార్టీలో పూర్తికాల కార్యకర్తలుగా పనిచేస్తామని హామీ ఇస్తున్నారు.ఇప్పటికే ప్రముఖ యాంకర్ శ్యామలా రెడ్డి మద్దతు తెలిపారు.
ఇప్పుడు తాజాగా నటి ప్రియ షర్మిలతో కలిసి నడుస్తామని ప్రకటించారు. """/"/
ఈ సందర్భంగా నటి ప్రియా మీడియతో మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి రాజశేఖర్ రెడ్డికి పెద్ద అభిమానినని చెప్పారు.
వైఎస్ను ఎప్పుడైనా కలవాలని ఉండేదని, కానీ కలవలేకపోయానని అన్నారు.ఇప్పుడు షర్మిల పార్టీ పెడుతున్నట్లు ప్రకటన చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.
తనకు రాజకీయం పట్ల పెద్దగా అవగాహన లేదని, వైఎస్ చేసిన కార్యక్రమాలు చూసి.
తాను కూడా ప్రజలకు సేవ చేయాలని అనుకున్నానని చెప్పారు.మరోవైపు కాంగ్రెస్ నుంచి షర్మిల పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి.
వైఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీలో పని చేసిన కల్పనా రెడ్డి షర్మిల పెట్టబోయే పార్టీకి మద్దతు తెలిపారు.
మొత్తంగా చూస్తే.కేసీఆర్ సహా కీలక నాయకులు అనుకున్న దానికి భిన్నంగానే షర్మిల దూకుడు ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తుండడం గమనార్హం.