క‌విత కోస‌మే ఆయ‌న‌కు కేసీఆర్ ఎమ్మెల్సీ ఇచ్చారా..

కేసీఆర్ అంటే రాజ‌కీయ వ్యూహాలు ప‌న్న‌డంలో దిట్ట అనే పేరుంది.ఆయ‌న ఏదైనా ప‌ని చేస్తున్నారంటే అందులో భ‌విష్య‌త్ ఫ‌లిత‌మే ఎక్కువ‌గా ఉంటుంది.

అందుకే ఆయ‌న్ను రాజ‌కీయ చాణ‌క్యుడిగా భావిస్తారు.ఇప్పుడు కూడా ఇలాంటి ప్లానే వేసిన‌ట్టు తెలుస్తోంది.

మొన్న ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ప‌ద‌వుల‌ను కేసీఆర్ ఎవ‌రూ ఊహించ‌ని వారికి ఇచ్చారు.

ఇందులో మ‌రీ ముఖ్యంగా రాజ్య‌స‌భ స‌భ్యుడు అయిన బండా ప్ర‌కాశ్ ఇవ్వ‌డం అంద‌రికీ షాక్ ఇచ్చింది.

ఎందుకంటే ఆయ‌న ఇప్పటికే రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్నారు.ఆయ‌న ప‌ద‌వీకాలం ఇంకా మూడేళ్లు ఉంది.

మ‌రి ఎంతో మంది ప‌ద‌వి లేకుండా ఎమ్మెల్సీ కోసం ఆశ‌లు పెట్టుకుంటే వారంద‌రినీ కాద‌ని, ఆల్రెడీ ప‌ద‌విలో ఉన్న వ్య‌క్తిని ఆ ప‌ద‌వికి రాజీనామా చేయించి మ‌రీ ఎమ్మెల్సీకి ఎందుకు నామినేట్ చేసిన‌ట్టు అని ప్ర‌చారం ఊపందుకుంది.

అయితే ఇందులో కేసీఆర్‌ ఎత్తుగ‌డ ఉన్న‌ట్టు తెలుస్తోంది.త‌న కూతురు క‌విత కోస‌మే ఆయ‌న‌తోరాజీనామా చేయించిన‌ట్టు తెలుస్తోంది.

క‌విత గ‌త పార్లమెంటు ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన‌ప్ప‌టి నుంచి ఎలాంటి ప‌ద‌వి లేకుండా ఉండిపోయారు.

అయితే ఆమెకు ఎమ్మెల్సీ ఇస్తార‌నే ప్ర‌చారం జ‌రిగినా అది జ‌ర‌గ‌లేదు.దీంతో ఆమె ప్ర‌భావాన్ని మ‌ళ్లీ పెంచేందుకు కేసీఆర్ ఆలోచిస్తున్నారంట‌.

ఇప్ప‌టికే కొడుకు కేటీఆర్ మంత్రిహోదాలో పెద్ద స్థాయిలో ఉన్నారు.కానీ కూతురుకు ఎలాంటి ప‌ద‌వి లేక‌పోవ‌డం కేసీఆర్‌కు బాధ క‌లిగిస్తుందంట‌.

అందుకే ఆమెను బండ ప్ర‌కాశ్ స్థానంలో రాజ్య స‌భ స‌భ్యురాలిగా చేస్తార‌ని తెలుస్తోంది.

అయితే బండ ప్ర‌కాశ్‌ను ఈట‌ల‌కు చెక్ పెట్టేందుకు టీఆర్ ఎస్‌లోకి తెచ్చార‌నే వాద‌న కూడా ఉంది.

కానీ కేసీఆర్ కూడా ఈట‌ల రాజేంద‌ర్ గెలుపును ఆప‌లేక‌పోయారు.మ‌రి బండ ప్ర‌కాశ్ తో ఏమ‌వుతుంది.

ఏదేమైనా కూడా కేసీఆర్ కూతురు కోసం మ‌రో స్టెప్ తీసుకున్నార‌న్న‌మాట‌.

ఎన్టీఆర్ బర్త్ డే రోజున ఆ రెండు ప్రకటనలు వస్తాయా.. ఆ అప్ డేట్స్ వస్తే మాత్రం పండగేనంటూ?